Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నాళ్లు పనిచేసిన పూరీ జగన్నాథ్.. 2000 సంవత్సరంలో బద్రి సినిమాతో డైరెక్టర్ గా మారారు. తొలి సినిమా తోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. కొన్ని కొన్ని దశల్లో వరస ఫ్లాపుల వల్ల కెరీర్ పూర్తిగా డౌన్ అయినా.. మళ్లీ కంబ్యాక్ ఇస్తూ తన ఉనికి చాటుకున్నారు.
ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయాన్ని అందుకుంది. రామ్ కు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ను పట్టాలెక్కించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. పూరీ జగన్నాథ్ టాలీవుడ్ లో ఎంతో మంది హీరో, హీరోయిన్లకు తన సినిమాల ద్వారా స్టార్డమ్ అందించాడు.
కానీ తన తమ్ముడు సాయి రామ్ శంకర్ ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయారు. ఇప్పటికీ సాయి రామ్ శంకర్ ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు కష్టపడుతూనే ఉన్నాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పూరీ జగన్నాథ్ కు సాయి రామ్ శంకర్ తో పాటు మరో సొంత తమ్ముడు కూడా ఉన్నాడు. అవును మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో సింహాచలం దంపతులకు పూరీ జగన్నాథ్ జన్మించారు. అతని స్వస్థలం అనకాపల్లి జిల్లాకు చెందిన బాపిరాజు కొత్తపల్లి గ్రామం.
పూరీ జగన్నాథ్కు ఇద్దరు తమ్ముళ్లు. మొదటి తమ్ముడు పేరు తమ్ముడు పెట్ల ఉమా శంకర గణేష్ కాగా.. రెండో తమ్ముడు సాయి రామ్ శంకర్. రెండో తమ్ముడు మనందరికీ తెలుసు. కానీ, ఉమా శంకర గణేష్ పూరీ తమ్ముడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన ఇరవై ఏళ్ల వయస్సులోనే సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు. అక్కడి నుంచి మొదలైన ఉమా శంకర్.. ప్రస్తుతం వైజాగ్ జిల్లా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు. మన మంచితనంతో ప్రజలు మెచ్చిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.