NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు బిగ్ షాక్ .. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పొక్సో కేసు నమోదు

Yediyurappa: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయనపై పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.

yediyurappa

నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో సహాయం కోసం ఒక మహిళ తన 17 సంవత్సరాల కూతురితో పాటు యడ్యూరప్పను కలిసేందుకు వెళ్లారుట. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వాళ్లు పోలీసులను ఆశ్రయించగా..అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

మరో వైపు యడియూరప్ప కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొంది. వారు ఇప్పటి వరకూ 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఆరోపణలపై యడియూరప్ప కూడా స్పందించారు. ‘కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తనకు సమస్య ఉందంటూ నా ఇంటికి వచ్చింది. దీనిపై ఆరా తీసి, ఆమెకు సాయం చేయాలని పోలీస్ కమిషనర్ కు చెప్పాను. ఆ తర్వాత ఆమె నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. గురువారం ఆమె నాపై కేసు పెట్టింది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇప్పుడే చెప్పలేను; అని యడియూరప్ప పేర్కొన్నారు.

ఈ విషయంపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. మాజీ సీఎం యడియూరప్ప తన కుమార్తెపై లైంగిక దాడి చేసినట్లు సదాశివనగర్ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకూ ఇంతకు మించి వివరాలు చెప్పలేనని అన్నారు. ఇందులో మాజీ సీఎం ప్రమేయం ఉన్నందున ఇది చాలా సున్నితమైన కేసు అని పేర్కొన్నారు. ఈ కేసులో రాజకీయ కోణాన్ని మంత్రి పరమేశ్వర తోసిపుచ్చారు.

కర్ణాటకకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా యడియూరప్ప పని చేశారు. సీఎం పదవి వీడిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గత ఏడాది నవంబర్ లో ఆ బాధ్యతలను హైకమాండ్ ఆయన కుమారుడు విజయేంద్ర కు అప్పగించింది. ప్రస్తుతం యడియూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు.

YS Jagan: మరో మారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన సీఎం వైఎస్ జగన్

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju