Samantha: హీరోయిన్ సమంత “ఖుషి” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. అంతకుముందు వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులతో సతమతమయింది. 2021లో నాగచైతన్యతో విడాకులు 2022లో వయోసైటీస్ వ్యాధితో బాధపడటం జరిగింది. ఈ క్రమంలో ఆమె నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయంలో విజయ్ దేవరకొండతో “ఖుషి” నటించి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సమంతకి వరించాయి. తెలుగులో మాత్రమే కాదు తమిళ్ లో చాలామంది స్టార్ హీరోలతో నటించి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే మయో సైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత.. ఆరోగ్యపరంగా సమంత అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఇటీవల పూర్తిగా కోలుకోవటం జరిగింది. ఖుషి సినిమా తర్వాత దాదాపు మూడు నెలల పాటు విదేశాలలో ట్రీట్మెంట్ తీసుకుని ఇటీవల హైదరాబాద్ కి సమంత చేరుకోవడం జరిగింది. మళ్లీ ఇప్పుడు షూటింగ్ లలో బిజీ అవుతుంది. ఈ క్రమంలో “చెన్నై స్టోరీస్” అనే ఆంగ్ల చిత్రంలో ఆమె నటిస్తున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ నుండి సమంతకి బిగ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా “ది బుల్” అనే సినిమా చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా మొదట త్రిష పేరు వినబడింది. అయితే ఇప్పుడు సమంతని తీసుకోవడానికి సినిమా యూనిట్ రెడీ కావడం జరిగిందంట. “ఊ అంటావా మావా ఊఊ అంటావా” అనే ఐటెమ్ సాంగ్ తో సమంత నటనకి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా కావడం జరిగింది. ఆఖరి దృష్టిలో పెట్టుకొని సల్మాన్ ఖాన్ కి జంటగా ఈ బ్యూటీ ని నటింప చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.