Kumkuma Puvvu February 5 2024 Episode 2096: కానిస్టేబుల్స్ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. అరుణ్ కుమార్ అక్క మనకు ఇటుపక్కనే దగ్గర ఎగ్జిబిషన్ పడింది మన అందరం అక్కడికి వెళ్లి సరదాగా ఎగ్జిబిషన్ చూసి వద్దామా అని అంటాడు. కావేరి ఆ అవును రా తమ్ముడు ఆ ఎగ్జిబిషన్లో చాలా కొత్త కొత్త రకాల చీరలు వస్తాయంట నేను కొన్ని చీరలు తీసుకోవాలి రా తమ్ముడు అని అంటుంది. అమృత ఇంకేంటి వదిన నాకు కూడా తమిళనాడు కాటన్ చీరలు అంటే చచ్చేంత ఇష్టం సరదాగా అలా వెళ్లి చెరో రెండు డజైన్ల చీరలు తీసుకొని వద్దాం పద వదిన అంటుంది. యుగంధర్ ఎసీపి ఆపుతారా మీ నస అని అంటాడు.చంద్రం అయ్యో అదేంటి ఎసిపి గారు మీరు ఇల్లంతా చూసుకోమని చెప్పాము కదా మిమ్మల్ని మేము ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాం చెప్పండి అని అంటాడు.
ఇంతలో కానిస్టేబుల్ వచ్చి సార్ ఇల్లంతా వెతికాం అంజలి బంటి ఎక్కడా కనిపించలేదు వాళ్ళు ఎంతో తెలివిగా ఇక్కడ నుండి ఎస్కేప్ యినట్టు ఉన్నారు సార్ అని అంటాడు. యుగంధర్ అర్థమయింది మీ వెటకారమైన మాటలు నాకు ఇప్పుడు అర్థమైంది పట్టుకుంటాను సిటీ మొత్తం వెతికి పట్టుకుంటాను అంజలిని బంటిని చేస్ చేసి పట్టుకొని తీసుకువచ్చి జైల్లో వేస్తాను మీరు చూస్తూ ఉండండి అంటూ యుగంధర్ కావేరి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వెళతాడు.
కట్ చేస్తే శాంభవి జై చంద్ర ఫౌండేషన్ లో మెంబర్లు శాంభవికి వార్నింగ్ ఇచ్చి వెళ్లాక శాంభవి చాలా కోపంగా వెళ్లి జై చంద్ర ఫోటో వైపు చూస్తూ నీ పుట్టినరోజు నీకు మిగిలిన వారసులు మేమే ఇక ఎవరూ రారు కాబట్టి అప్పటినుండి నీ పుట్టినరోజు వేడుకలు ఈ ఊర్లో ఘనంగా చేస్తున్నాను నువ్వు చచ్చాక కూడా ఈ వేడుకలు ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కూడా నీ పుట్టినరోజు వేడుకలు ఏమాత్రం తగ్గకుండా చూస్తాను ఊరంతా భోజనాలు అందరికీ బట్టలు పెట్టిస్తాను ఊరిలో ఉన్న వారిచేతే నీ ఆస్తికి నీనే వారసురాలిని అని వాళ్లతోనే చెప్పిస్తాను ఈ జై చంద్ర ఫౌండేషన్ ప్రకృతి వైద్యశాల ఇంకా మిగిలిన ఆస్తులకు నేనే రాణి నవుతాను అనుకుంటూ పెద్దకొడుకు చరణ్ రాజును పిలిచి రేపు జై చంద్ర తాతయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించాలి అందుకు కావలసిన భోజన ఏర్పాట్లు బట్టలు అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని చెబుతోంది.చరణ్ రాజు అలాగే అమ్మ నువ్వు చెప్పినట్లే ఏ లోటు రాకుండా పుట్టినరోజు వేడుకలు బాగా జరిగేలా చూసుకుంటాను అని అంటాడు.
పెద్ద కోడలు మాధవి అదేంటండి పుట్టినరోజుకు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా భోజనాలు బట్టలు అంటే ఎంత పెద్ద ఖర్చవుతుంది తెలుసా? ఇదంతా అవసరమా అని అంటుంది. శాంభవి తన కోడలి మాధవి వైపు కోపంగా చూస్తూ తన కొడుకును ఒరేయ్ చరణ్ ప్రతి అడ్డమైన వాళ్ళకి నోరు బాగా లేస్తుంది నేను చెప్పిన పని చేయడం మాత్రమే తెలుసుకోండి అంతే తప్ప ఇలా డొంకతిరుగుడు మాటలు మాట్లాడొద్దు అని అంటుంది. చరణ్ ఏయ్ నీకు ఒళ్ళు ఎలా ఉంది నీ నోరు బాగా లేస్తుంది అమ్మకి ఎదురు సమాధానం చెబుతావా నీ ఒళ్ళు పగలగొడతాను జాగ్రత్త అని అంటాడు.అప్పుడు మాధవి మనసులో అత్త శాంభవి నీ ఈవిడ ఏమి ఆశించి చేస్తుందో నాకు బాగా తెలుసులే అని అనుకుంటుంది. శాంభవి సరే నేను హైదరాబాద్ వెళుతున్నాను ఇరవై ఐదు ఏళ్ళు గడువు పూర్తి కావస్తుంది కదా అక్కడ లాయర్ తో మాట్లాడి వస్తాను అని చెబుతుంది. చరణ్ రాజ్ అలాగే అమ్మ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా నేను ఇక్కడ కావలసిన పనులు అన్ని ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని చెబుతాడు. పనిమనిషి రంగయ్య ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇద్దరిని తీసుకువచ్చి శాంభవి కాలం ముందు పడేస్తాడు. శాంభవి ఏంటి రంగయ్య ఏం జరిగింది వీళ్ళు ఏం తప్పు పని చేశారు అని అడుగుతుంది. రంగయ్య అమ్మ వీళ్లిద్దరికీ ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది. కానీ వీళ్లు పని కోసం మీ దగ్గర అబద్ధం చెప్పి చేరారు అని చెబుతాడు.
శాంభవి చాలా కోపంతో ఏంటి వీళ్లిద్దరూ భార్య భర్తలా అంటే నన్ను మోసం చేశారా పని కోసం మోసం చేసి నా ఇంట్లో పనికి వచ్చారా మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను నాకు భార్యాభర్తలు అంటే నచ్చదు భార్య భర్తల్ని ఎవరిని పనిలో పెట్టుకొను అని ముందే చెప్పాను కానీ మీరు నన్ను మోసం చేశారు ఇది చాలా పెద్ద మోసం అందుకు శిక్ష ఏంటో తెలుసా? దీనికి నాలుగు చెంప దెబ్బలు వాడికి నాలుగు కొరడా దెబ్బలు అంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి శాంభవిస్తానని లాగిపెట్టి నాలుగు చెంప దెబ్బలు కొడుతుంది. చరణ్ కొరడా తీసుకుని పని వాడిని నాలుగు కొనడా దెబ్బలు వేస్తాడు. శాంభవి తెలుసు కదా నాకు భార్య భర్తలు అంటే ఎంత చిరాకో తెలుసు కదా ఇక మీరు ఇక్కడి నుండి నాకు కనిపించకుండా ఏటైనా వెళ్ళిపొండి అని అంటుంది. శాంభవి కూతురు అఖిల అమ్మ వాళ్ళు చేసింది దాంట్లో తప్పేముంది పాపం పొట్ట పూసుకోవడానికి అబద్ధం చెప్పి పనిలో చేరారు అని అంటుంది శాంభవి అఖిల నీకేం తెలియదు నువ్వు చిన్నపిల్లవి నోరు మూసుకో ఇద్దరు భార్య భర్తలు గతంలో ఇలాగే అబద్ధం చెప్పి వచ్చి పనికి చేరారు తరువాత వాళ్ళు ముద్దు ముచ్చట్లు సైగలు వీటితోనే వాళ్ళు రోజంతా గడిపేసేవారు చెప్పిన పనిని సక్రమంగా చేయకుండా పాలలో మూలికలు కలిపేటప్పుడు ఒక వ్యాధి మూలిక ఇంకొక వ్యాధికి ఇంకొక వ్యాధి మూలిక మరో వ్యాధికి కలిపి ఇచ్చారు అలా చేయడం వల్ల ఈ ఊరిలో ఎనిమిది మంది రోగులు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారు అందుకే అప్పటినుండి ఇప్పటివరకు పనిలో ఈ ఒక్కరిని పెళ్లి చేసుకున్న వారిని పెట్టుకోవడం లేదు అలాగే భార్య భర్తల్ని కూడా పెట్టుకోవడం లేదు అర్థమైందా ఇక వెళ్ళండి అని అంటుంది శాంభవి.
కట్ చేస్తే అంజలి బంటి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బంటి మన ప్రయాణం ఎటువైపు వెళుతుంది అని అడుగుతాడు. అంజలి గమ్యం లేని మన ప్రయాణం ఎటు వెళ్లిన పరవాలేదు కానీ ఆ ఏసిపి యుగంధర్ కంట్లో పడకుండా ఎటు ఒకవైపు దూరంగా వెళ్లి బ్రతుకుదాం అంటుంది.బంటి సరే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చెప్పు అంటాడు. మనము బస్టాండ్ కి రైల్వే స్టేషన్ కి ఎటు వెళ్లినా సరే ఆ యుగంధర్ కంపల్సరీ మనుషుల్ని పెట్టి వెతికిస్తూ ఉంటాడు మనం దొరికిపోతాం కాబట్టి ఎటైనా గుడి వైపుకు వెళ్లి అక్కడ కూర్చొని తర్వాత ఆలోచిద్దాం పద అని అంటుంది ఇద్దరూ ఒక గుడి దగ్గరికి చేరి మెట్ల మీద కూర్చుంటారు