Madhuranagarilo February 02 2024 Episode 277: ఏంటండీ అలా అరిచారు మీరు రాకుండా మేము డిన్నర్ చేస్తున్నామన్న ఇప్పటిదాకా మీ కోసం ఎదురు చూశాం అని రుక్మిణి అంటుంది. రోడ్డుమీద ఎదురు చూసావా అని శ్యామ్ అంటాడు. ఎందుకు అలా అడుగుతున్నారు అని రుక్మిణి అంటుంది. నువ్వు సాయంత్రం ఇంట్లోనే ఉన్నావా ఎక్కడికైనా బయటికి వెళ్ళావా అని శ్యామ్ అంటాడు. వెళ్లాను అని రుక్మిణి అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్లావు ఎవరిని కలవడానికి వెళ్లావు సమాధానం చెప్పు, చూశారా అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు అంటే ఎవరిని కలిసావు చెప్పు అని శ్యామ్ అంటాడు. మా అక్క ఎక్కడికి వెళ్లిందో నేను చెప్తాను నేను అ0త పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డందుకు శ్రీనగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్లి వచ్చింది అని రాదా చెబుతుంది. అబద్ధం తనుశ్రీ నగర్ కాలనీకి వెళ్లలేదు తనను జూబ్లీహిల్స్ లో చూశాను అని శ్యామ్ అంటాడు. జూబ్లీహిల్స్ లో ఎవరితోనో మాట్లాడుతుంటే నా కళ్ళారా చూశాను అని శ్యామ్ అంటాడు.
నువ్వు ఎవరినో చూసి రుక్మిణి అనుకుంటున్నావేమోరా తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని ధనంజయ్ అంటాడు. లేదు తాను జూబ్లీహిల్స్ కి వెళ్లి శ్రీనగర్ కాలనీ వెళ్లానని మీకు అబద్ధం చెప్పింది అని శ్యామ్ అంటాడు. మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది రేపు రాదా ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఆపడానికి మీరు నా మీద నింద వేస్తున్నారు నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అగ్నిలో దూకడానికి సిద్ధంగా ఉన్నాను అని రుక్మిణి అంటుంది. నువ్వు నిప్పులు అద్దుకడమేంటమ్మా నువ్వు నిప్పు అని మాకు తెలియదా అని మధుర అంటుంది.అది మన ఇంటికి పట్టిన తుప్పు వదిలించుకోకపోతే మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం అని శ్యామ్ అంటాడు. రాదని ఇంట్లో ఉంచడం కోసం నా మీద నింద వేసావు కదా నేనే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచే కాదు ఈ లోక నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతాను ఉండు అని రుక్మిణి వెళ్లి మేడ మీద నుంచి దూకపోతుంది. వాడు తొందరపడి మాట్లాడుతున్నాడు అమ్మ వాడి మాటలు పట్టించుకోకు అని మధుర అంటుంది.
నన్ను వదిలించుకోవడం కోసం అయినా అలా మాట్లాడుతున్నాడు అని రుక్మిణి అంటుంది. వాడేదో పొరపాటు పడి ఉంటాడు లేమా అని ధనంజయ్ అంటాడు. ఆ మాట ఆయన చెప్పాలి లేదంటే జీవితాంతం నేను నరకం అనుభవించాలి అని రుక్మిణి అంటుంది. మా అక్కను అనుమానించి అన్ని మాటలు అన్నందుకు క్షమాపణ చెప్పండి అని రాదా అంటుంది. నేనే పొరపాటు పడి ఉంటాను సారీ అని శ్యామ్ అంటాడు. నా మీద కోపం ఉంటే తిట్టండి కొట్టండి కానీ నన్ను అనుమానించకండి అని రుక్మిణి తన గదిలోకి వెళ్తుంది. కట్ చేస్తే, రుక్మిణి ఏదో ప్లాన్ తోటి ఇంటికి వచ్చింది తనను పట్టుకోవాలి అని శ్యామ్ ఆలోచిస్తాడు. ఇంతలో రుక్మిణి ఫోన్ పట్టుకుని గోడచాటుకు వెళ్లి మనోహర్ కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతుంది.శ్యామ్ తన వెనుకల ఫాలో అయి తన మాటలను వింటూ ఉంటాడు.
ఈ ఆస్తి అంతా మన చేతిలోకి వచ్చే అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు కుదిరినప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను నువ్వు మాత్రం నాకు దయచేసి ఫోన్ చేయకు అని రుక్మిణి అంటుంది. అలాగే అని మనోహర్ అంటాడు. రుక్మిణి ఎవరు లేరు అని అటు ఇటు చూసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది.ఇప్పుడు తనని నిలదీసిన తను ఇంకా పెద్ద రచ్చ చేస్తుంది ఇప్పుడు మాట్లాడకూడదు తను ఎవరితో మాట్లాడిందో తెలుసుకోవాలి తీగ లాగితే డొంక కదులుతుంది అని శ్యామ్ అనుకుంటాడు. ఇంతలో పండు వచ్చి ఏంటి డాడీ ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. నిద్ర పట్టడం లేదు పండు అని శ్యామ్ అంటాడు.క్షణంలో నిద్ర పట్టే చిట్కా నేను చెప్తాను రా డాడీ అని పండు రాధ దగ్గరికి తీసుకువెళ్లి డాడీ నువ్వు అమ్మ ఒడిలో పడుకో అని అంటాడు.
పండు ఏం మాట్లాడుతున్నావ్ అని రాధా అంటుంది.డాడీ కి నిద్ర రావట్లేదు అంట నీ ఒళ్ళు పడుకుంటాడు నిద్రపుచ్చు అని పండు అంటాడు. శ్యామ్ ని రాధఓల్లో పడుకోబెట్టి తను బెడ్ మీద పడుకుని గుడ్ నైట్ డాడీ అని అంటాడు. ఐ లవ్ యు రా బంగారం అని శ్యామ్ అంటాడు. రేపటితో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కాబట్టి ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో అని రాదా శ్యామ్ ని జో కొడుతుంది.ఇంతలో రుక్మిణి వచ్చి అది చూస్తుంది. రుక్మిణి ని చూసిన రాదా శ్యామ్ ని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వస్తుంది. నువ్వు ఇంటి ని వదిలేసి వెళ్ళిపోతున్నావంటే శ్యామ్
సార్ నా భర్తనే కదా నువ్వు శ్యామ్ సార్ ని ఒళ్ళో పడుకోబెట్టుకొని జో కొడితే ఎవరైనా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అని అనుకుంటారా నీ భర్తని వదిలిపెట్టలేక నువ్వు బాధపడుతున్నావు అనుకుంటారు కదా నేనైనా అలాగే అనుకోవాల్సి వస్తుంది కదా అని రుక్మిణి అంటుంది. రేపు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతాను ఆయనకు నిద్ర పట్టడం లేదంటే పాండు తీసుకొచ్చి బలవంతంగా నా ఒళ్ళో పడుకోపెట్టాడు అని రాధ అంటుంది. నా చెల్లెల్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు రాదా అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది