Jharkhand MLAs: హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. రాంచి బిర్సా ముండా విమానాశ్రయం నుండి రెండు ప్రత్యేక విమానాల్లో 43 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరిని బేగంపేట ఎయిర్ పోర్టు నుండి నేరుగా శామీర్ పేటలోని లియోనియా రిసార్ట్స్ కు తరలించారు.
ఇవేళ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. పది రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంపై సొరెన్ ను అధికార పక్షం ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు.
బలపరీక్ష జరిగే లోపు అధికార పక్షం ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు క్యాంప్ రాజకీయానికి తెరలేపింది కాంగ్రెస్. బలపరీక్ష రోజు వరకూ హైదరాబాద్ క్యాంపు లో జార్ఖండ్ కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు ఉండనున్నారు. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కు టీ పీసీసీ అప్పగించింది.
కాగా, రిసార్ట్స్ లో బస చేసిన జార్ఖండ్ ఎమ్మెల్యేలకు టీ కాంగ్రెస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు క టేకర్ ను నియమించింది. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం వరకూ ఎమ్మెల్యేలు హైదరాబాద్ రిసార్ట్స్ లో ఉండనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలు జార్ఖండ్ కు చేరుకుని నేరుగా అసెంబ్లీకి వెళతారు.
YSRCP: బాలినేని వ్యవహారం మళ్లీ మొదటికి .. అలకపాన్పు ఎక్కినట్లే(నా)..!