Dil Raju Venkatesh: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాత దిల్ రాజు వైవిద్యమైన సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించి ఇప్పుడు సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ నిర్మాతలలో ఒకరుగా చలామణి అవుతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విక్టరీ వెంకటేష్ తో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కి దిల్ రాజు శ్రీకారం చుట్టడం జరిగింది. విషయంలోకి వెళ్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తో సినిమా చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఈ రెండు సినిమాలను నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇప్పుడు మూడో సినిమా వీరి కలయికలో చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారట. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. వెంకటేష్ కి కలిసొచ్చిన జోనర్ కామెడీ. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ అద్భుతమైన నటనతో గత రెండు సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఇప్పుడు అదే తరహాలో ఓ కామెడీ సినిమా చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. వెంకటేష్ సంక్రాంతి పండుగకు “సైంధవ్” సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కానీ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. వెంకటేష్ కెరియర్ లో “సైంధవ్” 75వ సినిమాగా రిలీజ్ అయింది.
కానీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. తండ్రి కూతుర్ల సెంటిమెంటు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ కావటంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ఇప్పుడు తనకి కలిసి వచ్చిన కామెడీ జోనర్ లో అనిల్ రావిపూడితో మూడోసారి ముచ్చటగా వెంకటేష్ సినిమా చేయడానికి సిద్ధపడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. తెలుగు చలనచిత్ర రంగంలో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి పేరుంది. కామెడీ సినిమాలు తీయటంలో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా నిలిచాడు. దీంతో మూడోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తో దిల్ రాజు సినిమా చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా లవర్స్.. అధికారిక ప్రకటన త్వరగా రావాలని కోరుకుంటున్నారు.