Malli Nindu Jabili: మాలిని అక్కడికి ఎందుకు తీసుకువెళుతుంది అని ఆలోచిస్తాడు గౌతమ్. అక్క ఆయనని మా అత్తయ్యని ఇంటికి ఎందుకు రమ్మంటున్నావ్? కారు ఆపు నేను ఇక్కడే దిగి ఇంటికి వెళ్తాను అని మల్లి అంటుంది. మల్లి నువ్వు సైలెంట్ గా కూర్చో తర్వాత చెప్తాను అని మాలిని మల్లిని వాళ్ళ ఇంటికి తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, అమ్మ తొందరగా రా మల్లి కళ్ళు తిరిగి గుళ్లో పడిపోతే మాలిని హాస్పటల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకు వెళుతుంది అంట వెళ్దాం అని గౌతమ్ అంటాడు. మల్లి కళ్ళు తిరిగి పడిపోవడమేంటి మాలిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడమేంట్రా అని కౌసల్య అంటుంది. తెలియదమ్మా మనం తొందరగా వెళ్ళాలి రా అని గౌతమ్ అంటాడు.
మల్లి కళ్ళు తిరిగి పడిపోయింది అంటే ఏదో విశేషమై ఉంటుంది రా నువ్వు వెళ్ళు నేను రాను అని కౌసల్య అంటుంది. నువ్వు రా మా అక్కడికి వెళ్లాలి ముందు అని గౌతమ్ వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్తాడు. కట్ చేస్తే, మాలిని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రమ్మని పిలుస్తుంది. శంకరమ్మ కి ఒక ప్లేట్లో గంధం పసుపు కుంకుమ పళ్ళు పూలు పెట్టి తీసుకురమ్మని చెబుతుంది. ఎందుకక్కా అవన్నీ అని మల్లి అంటుంది. నువ్వు సైలెంట్ గా కూర్చో అందరికీ ఒకేసారి చెప్తాను గౌతమ్ వాళ్లు కూడా రాని అని మాలిని అంటుంది. నువ్వేదో పూజ చేసుకుని తాంబూలం ఇస్తున్నట్టు ఉంది మాలిని అని వసుంధర అంటుంది.
ఏం చేస్తున్నావ్ మాలిని అని శరత్ అంటాడు. ఇంతలో గౌతమ్ వాళ్లు కూడా అక్కడికి వస్తారు. మల్లి ఇది తాంబూలం అనుకుంటావో ఇంకేం అనుకుంటావో నీ ఇష్టం నీ అక్కగా నీకు ఇస్తున్నాను తీసుకో అని మాలిని తన ఒడిలో తాంబూలాన్ని పెడుతుంది. ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా మాలిని అని వసుంధర అంటుంది. నా చెల్లి తల్లి కాబోతుంది మమ్మీ అని మాలిని అంటుంది. డాక్టర్ గారు నిన్ను చూసి నువ్వు తల్లి కాబోతున్నావని చెప్పింది మల్లి అని మాలిని అంటుంది. ఈ చెత్త విషయం చెప్పడానికి మల్లి నీ ఇక్కడిదాకా తీసుకువచ్చావా అని వసుంధర అంటుంది. అమ్మగారు మల్లి విషయంలో మీరు ఎన్నోసార్లు ఎన్నో అన్నారు కానీ ఇప్పుడు మాత్రం మల్లిని ఏమి అనకండి మా అని మీరా అంటుంది. మల్లి మాత్రం ఆ విషయం విని షాక్ లోనే ఉంటుంది. ఈ విషయం కొందరికి కడుపు మంట గానే ఉండొచ్చు కానీ మా కుటుంబానికి ఇది మంచి శుభవార్త మల్లి మాకు వారసున్ని ఇస్తున్నావు అని కౌసల్య అంటుంది.
మల్లి ఎన్నో రోజులుగా పిల్లలు కావాలి అంటున్నాను నన్ను తండ్రిని చేసినందుకు చాలా థాంక్స్ అని గౌతమ్ మల్లి తీసుకువెళ్లబోతు ఉంటాడు. ఒక్క నిమిషం గౌతమ్ నేను మల్లి తో మాట్లాడిన తర్వాత తీసుకువెళ్ళు అని మాలిని అంటుంది. మల్లి అరవింద్ చనిపోయి నేను బాధపడుతూ ఉండగా ఒక రోజు నా దగ్గరికి వచ్చావు గుర్తుందా ఆరోజు నువ్వేమన్నావు నీకు బిడ్డలు పుట్టే అవకాశం పోయింది కాబట్టి నేను కూడా పిల్లలు కనకుండా ఉంటాను అక్క నీకు లేని సంతోషం నాకు అక్కర్లేదు అని అన్నావు కానీ నేను నా భర్త ఫోటో ముందుకు కూర్చుని ఏడుస్తూ ఉంటే నీ భర్తతో ఆనందంగా పిల్లల్ని కనడానికి ప్రయత్నిస్తావా నేను నా అరవింద్ చనిపోయాడు అని గుండెలు పగిలేలా ఏడుస్తుంటే నీ భర్తతో కాపురం చేస్తూ ఆనంద అనుభవిస్తావా ఇదేనా రక్తసంబంధం లో ఉండే స్వార్థం మా మమ్మీ ఎన్ని సార్లు చెప్పినా నేను వినలేదు ఇప్పుడు అర్థమైంది నువ్వెంత స్వార్ధపరురాలివో నేను బాధలో ఉంటే నువ్వు ఇలా ఎలా చేస్తావు మల్లి అని మాలిని అంటుంది.
నేను అసలు తల్లిని కావాలని అనుకోలేదు ఎలా అయ్యాను అని మల్లి ఆలోచిస్తుంది. ఆ టాబ్లెట్లు మార్చి తను తల్లి అయ్యేలా చేశాను అని గౌతమ్ అనుకుంటాడు.ఇప్పటికైనా దీని గురించి అర్థమైంది కదా దూరంగా ఉండడం మంచిది అని వసుంధర అంటుంది. మన పరిస్థితి బాగోలేదని ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండకూడదని కోరుకోవడం తప్పు మాలిని అని శరత్ అంటాడు. నీ కూతురు తల్లి కాబోతుందని మీకు సంతోషంగా ఉందేమో నాకు కడుపు మంటగా ఉంది అని వసుంధర అంటుంది. జరిగిన దాంట్లో మల్లి తప్పేమీ లేదు ఇకమీదటైనా నువ్వు మారితే మంచిది వసుంధర అని శరత్ అంటాడు. దేవుడు వ్రాసిన తలరాతలకి నా కూతుర్ని నిందిస్తున్నారు ఇది కరెక్ట్ కాదమ్మా అని మీరా అంటుంది. నీ కొంపలో ఉండడానికి ఏమి రాలేదు అని కౌసల్ అంటుంది. ఇంకెప్పుడూ ఇది నా ఇంట్లో కనపడకూడదు తీసుకొని వెళ్ళిపో అని వసుంధర అంటుంది.మల్లి ఇక్కడ ఇంతసేపు ఉండడం అంత మంచిది కాదు మన ఇంటికి వెళ్దాం పద అని కౌసల్య అంటుంది.గౌతమ్ మల్లి ని తీసుకుని వెళ్తాడు.
మల్లి నువ్వు తల్లివి కాబోతున్నావా అన్న విషయం ఒక కన్నతల్లిగా నాకెంత సంతోషాన్ని ఇచ్చిందో తన కూతురు తల్లి కాదన్న విషయం తనకి అంతే బాధ కలిగిస్తుంది,బాబు గారు మీరు తండ్రి కావాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు మీ కోరిక నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కౌసల్యమ్మ గారు మల్లి ని ఇప్పుడైనా సాధించకుండా కూతుర్ల ప్రేమగా చూసుకోండి అని మీరా అంటుంది.మల్లి ని తీసుకొని వెళ్ళిపోతారు గౌతమ్ కౌసల్య. మాలిని మాత్రం గుండె నిండా బాధతో గదిలోకి వెళ్ళిపోతుంది. మల్లి ఆలోచనలో పడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది