Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి అని హాసిని అంటుంది.తనకు ఎంత చెప్పిన బూడిదలో పోసిన పన్నీరే పాపం పెద్దబొటమ్మ ఏం చేసిందో పాపం కళ్ళల్లో కారం మంట తగ్గిందో లేదో అని విక్రాంత్ అంటాడు. కట్టుకున్న దాని మీద లేని జాలి పరాయి వాళ్ళ మీద ఉంది అని సుమన అంటుంది.నీ మీద కూడా జాలి పడతాను ఎప్పుడో తెలుసా నువ్వు సర్వం కోల్పోయినప్పుడు అని విక్రాంత్ లాప్టాప్ తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ అఖండ స్వామి దగ్గరికి వస్తారు. స్వామి గాయత్రీ దేవి శిరస్సు తాకిన చీరని చెప్పి చిన్నపిల్ల వేసుకునే చున్ని తీసుకొచ్చి పోలీసు మొహానికి చుట్టారు అని తిలోత్తమ అంటుంది. తిలోత్తమ గాయత్రి దేవి చిన్న పిల్లగా వచ్చిందని చెప్పారు కదా అని అఖండ స్వామి అంటాడు.తను గోపికల ఉందని మురిసిపోయారు అని వల్లభ అంటాడు. గాయత్రీ దేవి వేసుకున్న చున్నిని తెచ్చి చంద్రశేఖరానికి చుట్టారేమో అని అఖండ స్వామి అంటాడు.
ఈ విషయం నేను చెబితే మాత్రం వినలేదు స్వామి చెబితే తెలిసినట్టు మాట్లాడుతున్నావ్ అని వల్లభ అంటాడు. స్వామి గాయత్రి అక్క ఎక్కడుంది అని తిలోత్తమ అడుగుతుంది. మీ ఇంట్లోనే ఉందని నేను అంటాను ఉన్నది కేవలం ఫోటోనే అని మీరు అంటున్నారు ఎక్కడ అంటే అక్కడుందని అర్థం అని అఖండ స్వామి అంటాడు. గాయత్రి పెద్దమ్మ ఇంట్లోనే ఉంటే మా అమ్మను ఎప్పుడో చంపేసేది అని వల్లభ అంటాడు. గాయత్రీ దేవి కోసం తెచ్చిన బట్టనే చంద్రశేఖరానికి చుట్టి ఉంటుంది పెద్ద బొట్టమ్మ అని అఖండ స్వామి అంటాడు. అప్పుడు నైని చెప్పలేదు అని తిలోత్తమ అంటుంది. ఎవరి కోసం తెచ్చిందో అవన్నీ మరిచిపోయి ఆ బట్టని గాయత్రి పాప తలకి చుట్టే ప్రయత్నం చేయండి అని అఖండ స్వామి అంటాడు. ఆ పిల్ల చిచ్చరపిడుగు పుట్టనిస్తుందా అని తిలోత్తమ అంటుంది. ఆ పిల్ల తల మీద గొడుగుల చుట్టండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని అఖండ స్వామి అంటాడు. ఈ మాత్రమే నాకు చెప్పారు అని తిలోత్తమ వెళ్ళిపోతుంది.
ఆ వస్త్రం గాయత్రీ తల మీద అరగంట సేపు ఉన్న అంతా బయటపడిపోతుంది అని అఖండ స్వామి అంటాడు. కట్ చేస్తే, పాప శిరస్సుపై ఉంచిన తిలోత్తమ వాళ్ళు గుర్తుపడితే మీరే సమస్యలో పడతారు అని డమ్మక్క అంటుంది. డమ్మక్క ఏదో ఉపదేశం ఇస్తుంది అని దురంధర అంటుంది. శివ పెద్ద బొట్టమ్మతో మాట్లాడి ప్రాణాల మీదికి ఇలాగే తెచ్చుకుంది అక్క అని నైని అంటుంది. ఏంటి మరదలు జాగ్రత్త పడుతున్నారా అని వల్లభ అంటాడు.డమ్మక్క జాగ్రత్త చెప్తుందేమోరా అని తిలోత్తమ అంటుంది. ఇప్పుడు మా ఆవిడ తెలివితేటలు బయటపడుతుంది అని వల్లభ అంటాడు. ఏ విధంగా అని హాసిని అంటుంది. చిత్రలేఖన అని తిలోత్తమ అంటుంది. నైని కన్న బిడ్డ చిత్రపటం వేయించాలనుకుంటుంది అని డమ్మక్క అంటుంది. అయితే వెళ్లి గానుని తీసుకురాక అని సుమన అంటుంది. హలో మరదల నా భార్య వేసేది గానవి విచిత్రపటం కాదు నైని కన్న తొలి బిడ్డ గాయత్రీ దేవి చిత్రపటం అని వల్లభ అంటాడు. ఏంటి అన్నయ్య నువ్వు మాట్లాడేది అని విశాల్ అంటాడు. అక్కడ ఉండే గాయత్రి పెద్దమ్మ ఫోటో వేయమంటాను అనుకున్నావా కాదు అని వల్లభ అంటాడు. ఏంటి బ్రో గాయత్రి పెద్దమ్మ పునర్జన్మ ఎత్తి చిన్నపిల్లల ఎలా ఉందో చిత్రపటం గీయించాలనుకుంటున్నావా అని విక్రాంత్ అంటాడు.
గాయత్రి పెద్దమ్మని ఇక్కడ ఎవరు చూశారు అని విక్రాంత్ అంటాడు. తిలోత్తమ అత్తయ్య అన్న మాటలు నాకు అర్థం అయ్యాయి అమృత గడియలో గాయత్రీ అమ్మగారి నీడని చూశాను కదా దాన్ని బట్టి చిత్రం గీయొచ్చు అని తిలోత్తమ అత్తయ్య చెబుతుంది అని నైని అంటుంది.బాగా చెప్పావు నైని అని తిలోత్తమ అంటుంది. నేను ఆ చిత్రపటాన్ని చూడలే కదా ఎలా గీస్తాను అని హాసిని అంటుంది. నీ ప్రతి పని సద్వినియోగం చేస్తాము హాసిని పెద్ద బొట్టమ్మ తెచ్చిన వస్త్రాన్ని తీసుకు వచ్చి ఈ గాయత్రి పాపకి తలకి చుడితే ఆ చిత్రపటం గీయొచ్చు అప్పుడు మీరు కన్న బిడ్డ త్వరలోనే వస్తుంది విశాల్ అని తిలోత్తమ అంటుంది. ఇప్పుడు అది ఎక్కడుందో ఏమో అని విశాల్ అంటాడు. ఇన్స్పెక్టర్ ని తీసుకు వెళ్ళేటప్పుడు నువ్వే తీసుకున్నావు విశాల్ అది గుర్తు చేసుకో అని తిలోత్తమ అంటుంది. విశాల్ బాబు గుర్తు తెచ్చుకొని వెళ్లి తీసుకురండి అని డమ్మక్క చెబుతుంది.ఎందుకు బాబు ఆలోచిస్తున్నారు నేను వస్తాను కదా తేలిగ్గా దొరుకుతుంది అని డమ్మక్క విశాల్ ని తీసుకొని వెళ్తుంది. అక్క బొమ్మ వేయడానికి అన్ని రెడీగా పెట్టుకో అని నైని అంటుంది.ఏ గాయత్రి నీ మీద వస్త్రం పెట్టి బొమ్మ గీస్తారు అంట అని దురంధర పాపని ఎత్తుకుంటుంది.
వల్లభ వెళ్లి పెన్ను పేపర్ తెచ్చి హాసినికి ఇస్తాడు.కట్ చేస్తే,డమ్మక్క ఈ చున్నీ ఇక్కడ పెట్టినట్టు నాకు తప్ప ఎవరికీ తెలియదు నీకు ఎలా తెలుసు అని విశాల్ అంటాడు. మీరు కన్న కూతురు గాయత్రి పాపని నాకు ఎప్పుడో తెలుసు అని డమ్మక్క అంటుంది. ఈ విషయం విశాలాక్షికి ఎద్దులయ్య కి కూడా తెలుసా అని విశాల్ అంటాడు. తెలుసు కానీ ఈ విషయం నీ శత్రువుల ముందు బయట పెట్టడం ఎందుకు అని డమ్మక్క చాట తెచ్చి చాటలో పెట్టి వస్త్రాన్ని తీసుకు వెళ్ళమని చెబుతుంది. అంతా ఆ విశాలాక్షమ్మ దయ అని విశాల్ వస్త్రాన్ని చాటలో పెట్టి తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, విశాల్ వస్త్రాన్ని చాటలో పెట్టి తెచ్చావు అదేం పద్ధతి అని దురంధర అంటుంది. ఏదైతే ఏముందిలే వస్త్రాన్ని తెచ్చాడు కదా గాయత్రి అక్క జాడ తెలుస్తుంది అని తిలోత్తమ అంటుంది. అలా తెస్తేనే మంచిది అని డమ్మక్క చెప్పింది అందుకే తెచ్చాను అని విశాల్ అంటాడు.
విశాల్ ఆ చాటని అక్కడ పెట్టి వస్త్రాన్ని గాయత్రీ దేవికి చుట్టూ చిత్రపటం హాసిని వేస్తుంది అని తిలోత్తమ అంటుంది. విశాల్ ఆ వస్త్రాన్ని ఇవ్వగానే గాయత్రి తలకు చుడదాం అనుకునేసరికి పెద్ద గాలివీచి ఆ వస్త్రం పైకి ఎగిరిపోతుంది. అది పట్టుకోవడానికి అందరూ ప్రయత్నిస్తారు. కానీ అది అందక అందరూ కింద పడిపోతారు. ఏ హాసిని నా మీద పడ్డావ్ ఏంటే లే అని తిలోత్తమ అంటుంది. మీరే కదా అత్తయ్య పర్వాలేదు దెబ్బేమి తగలదు కదా అని హాసిని అంటుంది. గాయత్రి అమ్మ గారిని చూడాలనుకుంటే పెద్ద గాలివీచి ఇలా జరుగుతుందేంటి అని నైని టెన్షన్ పడుతుంది. ఆ సంఘటన చూసి విశాల్ కొంచెం ఊరట తెచ్చుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది