Mamitha Baiju: మమితా బైజు..ప్రస్తుతం ఈ పేరు సౌత్ ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. మలయాళ సూపర్ హిట్ ప్రేమలు సినిమా ద్వారా మమితా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కుర్రకారకు హార్ట్ ఫేవరెట్ గా, న్యూ క్రష్ గా మారిపోయింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి మనసును కూడా దోచేసింది. దీంతో మమితా గురించి తెలుసుకునేందుకు చాలా మంది సినీ ప్రియులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మమితా బైజు బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఆమె తల్లిదండ్రులు ఎవరు..? సినిమాలోకి ఎలా వచ్చింది..? డాక్టర్ కావాల్సిన ఆమె యాక్టర్ ఎలా అయింది..? వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2001 జూన్ 22న కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్లో మమితా బైజు జన్మించింది. ఆమె తండ్రి బైజు కృష్ణన్ వృత్తిరిత్యా డాక్టర్ కాగా.. తల్లి మినీ బైజు గృహిణి. మమితాకు మిధున్ అనే ఒక అన్నయ్య ఉన్నాడు. మమిత తన పాఠశాల విద్యను కట్టచ్చిరాలోని మేరీ మౌంట్ పబ్లిక్ స్కూల్, మరియు NSS హయ్యర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేసింది. ప్రస్తుతం కొచ్చిలోని సేక్రేడ్ హార్ట్ కాలేజీలో B. Sc సైకాలజీ చదువుతోంది. మమితాను డాక్టర్ చేయాలని ఆమె తండ్రి ఆశపడ్డారు. కానీ చిన్నతనం నుంచి ఆమె సాంస్కృతిక కార్యక్రమాలపై ఎక్కువ మక్కువ చూపేది.
ఆ మక్కువతోనే కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఓసారి స్కూల్ లో నృత్య ప్రదర్శన ఇస్తుండగా.. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఆమెను చూసి సర్వోపరి పాలక్కారన్ చిత్రంలో ఓ చిన్న పాత్రను ఇచ్చారు. అలా నటనపై మమితాకు ఆసక్తి ఏర్పడింది. 2017లో సర్వోపరి పాలక్కారన్ సినిమాతో మమితా మలయాళ ఇండస్ట్రీలో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె తొమ్మిదో తరగతి చదువుతుండటం విశేషం. ఆ తర్వాత హనీ బీ 2: సెలబ్రేషన్స్, డాకిని, కృష్ణం, వరతన్, స్కూల్ డైరీ, వికృతి, ఆపరేషన్ జావా, ఖో ఖో, రాండు, సూపర్ శరణ్య.. ఇలా అనేక మలయాళ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2021లో ఖో ఖో మూవీలో ఖోఖో గేమ్ టీమ్ కెప్టన్ గా అదరగొట్టి ఉత్తమ నటిగా కేరళ ఫిల్మ్స్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది. ఇక ఇటీవల వచ్చిన ప్రేమలు చిత్రం ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ మార్చి 8న తెలుగులో విడుదల చేశాడు. నటీనటులు అందరూ కొత్తవారే అయినా.. ఇక్కడ కూడా ఈ చిత్రం అందరినీ కట్టిపడేసింది. ముఖ్యంగా ఈ మూవీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రీనూ పాత్రలో మమితా తనదైన లుక్స్, యాక్టింగ్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మెస్మరైజ్ చేసింది. సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచింది. యుతవరం కలల రాణిగా మారిపోయింది. రాజమౌళి సైతం మమితా యాక్టింగ్ పై ప్రేమలు సక్సెస్ మీట్ లో ప్రశంసలు కురిపించారు. దీంతో ప్రస్తుతం మమితా బైజుకు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అన్నట్లు త్వరలోనే ఈ అమ్మడు రెబల్ అనే చిత్రంలో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?