TDP: టీడీపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. రానున్న ఎన్నికలకు టీడీపీ – జనసేన – టీడీపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుండగా, గత నెల 24న 94 మందితో తొలి జాబితా విడుదల చేసింది టీడీపీ.
తాజాగా రెండో జాబితా 34 మందితో విడుదల చేయడంతో, మరో 16 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలోనూ ఉమ్మడి విశాఖ జిల్లా నుండి గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, ఉమ్మడి కృష్ణాజిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు చోటు దక్కలేదు.
గాజువాక స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పల్లా శ్రీనివాసరావు పేరు ప్రకటించడంతో అక్కడి జనసేన శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంతో పాటు గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్ల పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇటీవలే వైసీపీ నుండి టీడీపీ లో చేరిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి నెల్లూరు జిల్లా కొవూరు అసెంబ్లీ అభ్యర్ధిగా ప్రకటించారు. అలానే వైసీపీ నుండి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు కూడా ఈ జాబితాలో చోటు లభించింది.
అభ్యర్ధుల రెండో జాబితా ఇలా
- నరసన్నపేట – బగ్గు రమణ మూర్తి
- గాజువాక – పల్లా శ్రీనివాసరావు
- చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు
- మాడుగుల – పైలా ప్రసాద్
- ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
- రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్
- రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- రంపచోడవరం – మిర్యాల శిరీష
- కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు
- దెందులూరు – చింతమనేని ప్రభాకర్
- గోపాలపురం – మద్దిపాటి వెంకట రాజు
- పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్
- గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ల మాధవి
- గుంటూరు ఈస్ట్ – మహ్మద్ నజీర్
- గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
- కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు
- మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
- గిద్దలూరు – అశోక్ రెడ్డి
- ఆత్మకూరు – అనం రాంనారాయణరెడ్డి
- కొవూరు (నెల్లూరు) – వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
- వెంకటగిరి – కురుగొండ్ల లక్ష్మీప్రియ
- కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
- ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి
- నందికొట్కూరు – గిత్తా జయసూర్య
- ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి
- మంత్రాలయం – రాఘవేంద్ర రెడ్డి
- పుట్టపర్తి – పల్లె సింధూరా రెడ్డి
- కదిరి – కందికుంట యశోదా దేవి
- మదనపల్లె – షాజహాన్ బాషా
- పుంగనూరు – చల్లా రామచంద్రారెడ్డి (బాబు)
- చంద్రగిరి – పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
- శ్రీకాళహస్తి – బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
- సత్యవేడు – కోనేటి ఆదిమూలం
- పూతలపట్టు – డాక్టర్ కలికిరి మురళీ మోహన్