గోధుమ పిండితో చేసే పరోటా అందరూ తినడానికి ఇష్టపడతారు.. ఎప్పుడూ ఒకే రకంగా పరోటా చేస్తే కొంతమంది తినటానికి ఇష్టపడరు.. పరోటాలలో ఆలు పరోటా ఎక్కువమంది ఇష్టపడతారు.. కాకపోతే ఇది చేయటానికి కాస్త సమయం పడుతుంది.. కానీ ఇలా సింపుల్ ప్రాసెస్ తో టేస్టీగా ఆలు పరోటా చేసేయండి..!
ఈ గింజలు డయాబెటిస్ వారికి వరం..!
ఆలు పరోటా తయారీకి కావలసిన పదార్థాలు.. గోధుమపిండి ఒక కప్పు, ఉడికించిన బంగాళ దుంపలు -3, జీలకర్ర పొడి ఒక చెంచా, కారం ఒక చెంచా, పసుపు కొద్దిగా, నూనె నాలుగు టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒకటి..
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి కొద్దిగా ఉప్పు, ఒక చెంచా కాగిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుతూ చపాతి పిండి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.. ఈ పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి.. అప్పుడే చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి..
జీరా వాటర్ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి నూనె వేసుకుని.. పోపు గింజలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేగిన తర్వాత జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం అన్ని వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను మెత్తగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలగాలి. చివరలో కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంప మిశ్రమం ఆరిన తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.. ముందుగా చేద్దాం చపాతి పిండిని ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.. ఈ ఉండలలో వేళ్లు సాయంతో కాస్త గుంటలాగా చేసుకోవాలి.. అందులో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి మళ్లీ ఉండలాగా చుట్టుకోవాలి.. మామూలు చపాతీలు లాగానే గోధుమపిండి వేసుకొని చపాతీలు చేసుకోవాలి.. ఇలా సిద్ధం చేసుకున్న చపాతీలను పెనం మీద నెయ్యి వేసుకుని దోరగా కాల్చుకోవాలి.. అంతే ఆలు పరోటా తినటానికి రెడీ.. ఈ ఆలు పరోటాలను పెరుగు రైతా తో తింటే ఇంకా రుచికరంగా ఉంటాయి..