Pain Killer: నేటి ఆధునిక జీవన విధానంలో శారీరక నొప్పులు సర్వ సాధారణమైపోయాయి శరీరంలో ఏ భాగమైనా ఏ భాగంలోనైనా నొప్పి వస్తుంది.. ఆ నొప్పి భరించడం కాస్త కష్టంగానే ఉంటుంది.. అందుకోసం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ను ఉపయోగిస్తున్నారు.. వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి..
కండరాలు నరాల నొప్పులు నుంచి ఉపశమనం పొందాలంటే పుదీనా తినాల్సిందే.. 6 పుదీనా ఆకులను తీసుకుని నమిలి తింటే వెంటనే నరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. పుదీనా ఆకులను నమిలితే పంటి, తల నొప్పి కూడా తగ్గుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒంటి నొప్పులు, తీపులు వంటివి కూడా తగ్గిపోతాయి. బాడీపెయిన్స్ ఎక్కువగా ఉంటే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా పుదీనా ఆయిల్ వేసి స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పులతో బాధపడుతున్న వారు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలుపుకొని తాగితే.. కండరాల నొప్పులు, తీపులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తక్షణమే తగ్గుతాయి.
Knee Pain: ఈ నూనెను మోకాళ్ళ చిప్పల పై రాసి మర్దన చేస్తే జన్మలో మోకాళ్ళ నొప్పులు రావు..!!
గ్యాస్ అసిడిటీ అజీర్తి వంటి సమస్యలు రాగానే వెంటనే టాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. వాటికి బదులు ఇప్పటినుంచి ఒక చెంచా పెరుగు తినండి. పెరుగులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కడుపు నొప్పి, నెలసరి నొప్పులు రాగానే కొద్దిగా పెరుగుతూ తిని వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ కండరాల నొప్పులు కడుపు నొప్పి ఛాతీ నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే అల్లం కావాల్సిందే ఈ సమస్యలు ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే ఉండాలి. మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్న వారు వేడివేడిగా అల్లం చాయ్ తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బ్రాంకైటిస్ వంటి సమస్యలకు అల్లం చెక్ పెడుతుంది.