MP Vijayasai Reddy: ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక బదిలీని పురస్కరించుకుని జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం, ఓ సెక్షన్ మీడియాలో దీనిపై డిబేట్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏరుదాటాక తెప్పతగలేయడం బాబు మార్క్ పాలిటిక్స్ అంటూ విమర్శించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు అయిదేళ్ల హయాంలో నలుగురు డీజీపీలను మార్చినా ఒక్కరూ మాట్లాడలేదన్నారు. జగన్ హయాంలో 30 నెలలు పని చేసిన డీజీపీగా చేసిన గౌతమ్ సవాంగ్ ను మారిస్తే ఆయనపై ఏదో ప్రేమ ఉన్నట్లు పచ్చ బ్యాచ్ గగ్గొలు పెడుతోందన్నారు విజయసాయి. సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ చేయడంతో పచ్చ మీడియాకు షాక్ కొట్టిందన్నారు.
Read More: Breaking: గౌతమ్ సవాంగ్ కు మరో కీలక పోస్టు ఇచ్చిన జగన్ సర్కార్
MP Vijayasai Reddy: ఏపిపిఎస్సీ చైర్మన్ గా
తొలుత ఏపి ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. గౌతమ్ సవాంగ్ ను జీఏడికి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరుణంలోనే వివిధ రాజకీయ పక్షాలు గౌతమ్ సవాంగ్ బదిలీ పై కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన అధికారిని అర్ధాంతరంగా బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. అయితే 24 గంటలు తిరగక ముందే గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం మరో ప్రాధాన్యత కల్గిన పోస్టులో నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నియమితులైయ్యారు.
Read More: CM YS Jagan: అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశం..ప్రస్తుత పరిస్థితిలో ఇది తప్పేలా లేదు.
చంద్రబాబు5 ఏళ్ల పాలనలో నలుగురు డీజీపీలను మార్చినా ఒక్కరూ మాట్లాడలేదు. జగన్ గారి హయాంలో 30 నెలలు డీజీపీగా చేసిన గౌతమ్ సవాంగును మారిస్తే ఆయనపై ఎదో ప్రేమున్నట్లు పచ్చ బ్యాచ్ గగ్గోలు. సవాంగ్ ను APPSC చైర్మన్ చేయడంతో పచ్చ మీడియాకు షాక్. ఏరుదాటాక తెప్ప తగలేయడం బాబు మార్క్ పాలిటిక్స్.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 17, 2022