Breaking: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం మరో కీలక పోస్టింగ్ ఇచ్చింది. గౌతమ్ సవాంగ్ ను ఏపిపీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదలైంది. రెండు సంవత్సరాలుగా ఏపి పోలీస్ బాస్ గా బాధ్యతలు నిర్వహించిన గౌతమ్ సవాంగ్ ను ప్రభుత్వం అర్ధాంతరంగా రెండు రోజుల క్రితం బదిలీ చేసింది. గౌతమ్ సవాంగ్ స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీగా పని చేస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం గౌతమ్ సవాంగ్ ను జిఏడికి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
Read More: Breaking: ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు..కొత్త పోలీస్ బాస్గా రాజేంద్రనాథ్ రెడ్డి..
Breaking: గౌతమ్ సవాంగ్ ఆర్ధాంతర బదిలీపై
గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తూ సీఎం జగన్మోహనరెడ్డి వద్ద మంచి మార్కులనే కొట్టేసిన గౌతమ్ సవాంగ్ అర్ధాంతర బదిలీ కావడంపై రాష్ట్రంలో అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడికి రిపోర్టు చేయాలన్న ఆదేశాలపైనా విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో గౌతమ్ సవాంగ్ కు ఏపిపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.