Dosa: మనకు లభించే చిరుధాన్యాలలో రాగులు కూడా ఒకటి. రాగులు సంపూర్ణ పోషకాహారం గా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు.. ఇందులో లో క్యాల్షియం పొటాషియం విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. పైగా ఈ వేసవికాలంలో వీటిని తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది.. రాగి దోశ ఇప్పుడు చెప్పుకునే విధంగా తయారు చేసుకొని తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
Dosa: రాగి దోశకు కావాల్సిన పదార్ధాలు..
ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు బియ్యప్పిండి, అర కప్పు పెరుగు కావాలి. అట్టు లో వేసుకోవడానికి ఒక టీ స్పూన్ చొప్పున తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు అవసరం. అర టీస్పూన్ ఉప్పు, మిరియాల పొడి, సరిపడినంత నీళ్లు కావాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి సరిపడినన్ని నీళ్లు కలిపి రాగి దోశ బ్యాటర్ ను కలుపుకోవాలి. 20 నిమిషాలు పిండి నానిన తరువాత పెనం మీద అట్టు వేసుకోవాలి. వేడివేడిగా రాగి దోశ రుచికరంగా ఉంటుంది.
ఉదయం అల్పాహారంలో, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ లో కానీ రాగి దోశ తీసుకుంటే.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ దోశ తింటే డయాబెటిస్ తగ్గుతుంది. శరీరంలో ఉన్న వేడి ని తొలగించి శరీరానికి చలవ చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.