Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. నెపాల్ తో పాటు ఉత్తర భారతంలో భూకంపం మరువక ముందే ఈ వేకువ జామున 2.29 గంటల సమయంలో పోర్ట్ బ్లేయర్ లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3 గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో పది కిలో మీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
నేపాల్ లో బుధవారం వేకువజామున 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో దోతి జిల్లాలో భవనాలు కూలడంతో ఆరుగురు మరణించారు. అదే విధంగా ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
Earthquake: నేపాల్ లో భారీ భూకంపం ..భవనాలు కూలి ఆరుగురు మృతి..భారత్ లోనూ ప్రభావం