WHO: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ప్యూ సడలింపునకు సన్నద్దం అవుతున్నాయి. సాధారణ జన జీవనం కనిపిస్తోంది. అయితే కొద్ది నెలలగా కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ థర్డ్ వేవ్ ముఖ్యంగా పిల్లలపై ఎక్కవగా ప్రభావం ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై టీకా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే థర్డ్ వేవ్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) చేసిన కీలక వ్యాఖ్యలు ఊరట నిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ- ఎయిమ్స్ (ఢిల్లీ) కలిసి జరుపుతున్న ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.
పిల్లలపై కరోనా మూడో ఉధృతి అధిక ప్రభావం చూపే అవకాశాలు లేవని ఈ అధ్యయనంలో వెల్లడైంది. చిన్నారులు, వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు ఇప్పటి వరక కాస్త అటూ ఇటుగా ఒకే స్థాయిలో ఉన్న సంగతిని గుర్తు చేసింది. ఈ ఏడాది మార్చి 15 నుండి జూన్ 10 మధ్య ఢిల్లీ అర్బన్ రీ సెటిల్మెంట్ కాలనీ, ఢిల్లీ రూరల్, భువనేశ్వర్ రూరల్, గోరఖ్ పుర్ రూరల్, అగర్తల రూరల్ ప్రాంతాల్లో 4,509 మంది నుండి పరిశోధకల నమూనాలను సేకరించారు. అందులో 700 నుండి 2-17 ఏళ్ల మధ్య వయసు వారు. మిగిలిన వారంతా 19 సంవత్సరాల పైబడినవారు. పూర్తి స్థాయి అధ్యయనం ఇంకా కొనసాగుతున్నా..ఇప్పటి వరకూ గుర్తించిన వివరాలను పరిశోధకులు తాజాగా వెల్లడించారు.
Read More: AP Legislative Council: మండలిలో మారిన లెక్కలు..! వైసీపీ ఆధిక్యత..!!
సీరో పాజిటివిటీ రేటు 18 సంవత్సరాల లోపు వారిలో 55.7 శాతంగా, అంత కంటే ఎక్కువ వయసున్న వారిలో 63.5 శాతంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకూ పిల్లలపైనా దాదాపుగా వయోజనుల స్థాయిలోనే కరోనా ప్రభావం చూపిందని దీని బట్టి అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. థర్డ్ వేవ్ లో ప్రత్యేకంగా చిన్నారులపైనే తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన అవసరం లేదని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులతో పోలిస్తే పిల్లల్లో సార్స్ – కోవ్ -2 సీరో పాజిటివిటీ రేటు కాస్త తక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది.