బీజేపీ పార్లమెుంటరీ పార్టీ సమావేశంలో వాడివేడి చర్చ సాగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నేడిక్కడ జరుగుతున్న బీజేఎల్పీ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో పార్టీ పరాజయం, మిజోరం, తెలంగాణ ఫలితాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. పార్టీ పరాజయానికి కారణాలపై బీజేఎల్పీ సమావేశం లోతుగా చర్చిస్తున్నదని సమాచారం. సార్వత్రిక ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం పడకుండా తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. అదే విధంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సమావేశం చర్చిస్తుంది.
previous post
next post