ఈ రోజుల్లో గంటలు తరబడి సిస్టమ్స్ ముందు కదలకుండా కూర్చుని పని చేయడంవలన అధిక బరువు బారిన పడకతప్పడం లేదు..ఒకవేళ వ్యాయామం చేసిన కూడా స్లిమ్గా అవుతున్నారు కానీ బొజ్జ పెరిగిన పొట్ట మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అలాని వ్యాయామం మానేయమని కాదు దానితో పాటు కొన్ని చిట్కాలు పాటించడం వలన పొట్ట కూడా తగ్గి చాల అందం గా మారతారు..మరి పొట్ట పెరగకుండాఅదుపు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ప్రతిరోజూ నీటిలో వాము కలుపుకొని తాగాలి అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
బొజ్జ తగ్గడానికి ప్రతిఒక్కరూ వ్యాయామం చేస్తూ వారి డైట్లో వాము తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు ఉదయాన్నే లీటరు నీటిని తీసుకుని అందులో టీస్పూన్ వాము వేసి బాగా మరిగించి నీరు చల్లారిన తర్వాత రోజు మొత్తం వాటిని కొంచెం కొంచెంగా తాగుతూ ఉండాలి.
ఆలా చేయడం వలన తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయి బరువు త్వరగా తగ్గడం తో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా త్వరగా కరిగిపోతుంది .
వాము మాత్రమే కాదు సబ్జా గింజలు కూడా పొట్టను తగ్గించడానికి అంతే బాగా పనిచేస్తాయి. విటమిన్ కే , ఏ, ఈ, బీ లు ఇందులోసంవృద్ధి గా లభిస్తాయి.
వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాపర్, క్యాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి పోషణ అందేలా చేయడం లో బాగా సహాయపడతాయి.
ఇవి శరీరానికి పోషణ అందించడం తో పాటు బరువు బరువు తగ్గేలా కూడా ఉపయోగపడతాయి.
ప్రతి రోజూ అన్నమే కాకుండా వారానికి మూడు రోజులుఅన్నం కి బదులుగా గోధుమరవ్వను ఆహారంలో తీసుకుంటే శరీరంలోని కొవ్వు చాలా తేలికగా కరిగించుకోవచ్చు.
శరీరానికి చలవ చేసే పెసలు బరువు తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతాయి. ఇది శరీరంలో ఉన్న కొవ్వును తగ్గేలా చేస్తాయి.
ప్రతిరోజూ ఒక కప్పు పెసలను ఉడకబెట్టుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది. అలా కాదు అనుకుంటే వాటిని మొలకెత్తించుకొని తింటే ఆరోగ్యానికి మరింత మంచిది.శరీరానికి అవసరమైనన్ని పోషకాలు అందుతాయి.