మనుషులు ఎంతటి దారుణాలకి ఒడికడతారు అనేది కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. లాక్ డౌన్ లో కన్న కూతురు ని మానభంగం చేసిన తండ్రి ఉదంతం హైదరబాద్ లో బయట పడింది. కన్న కూతురు ని అల్లరుముద్దుగా పెంచుకోవాల్సిన తండ్రి ఆమెకే కడుపు చేశాడు.
14 సంవత్సరాల వయసున్న పాప దుండిగల్ లో ఉంటోంది, తల్లి లేని టైమ్ చూసి లాక్ డౌన్ సమయం లో తండ్రి ఆమె మీద పలుమార్లు అత్యాచారం చేశాడు. దాంతో ఆ పాప కి ఇప్పుడు ఐదు నెలల కడుపు వచ్చింది. మొదట పాప కడుపులో ఏదో నొప్పిగా ఉండడం తో ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా ఈ వ్యవహారం బయటపడింది. దుండిగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం కి వెంటనే స్థానికులు ఈ విషయం తెలియజేయడం తో అసలు కథ తెలిసింది.
అబార్షన్ చేయించడం కోసం ఆ తల్లి తన కూతురుని తీసుకుని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినట్టు తెలుస్తోంది. చాలా ఆసుపత్రులు కుదరదని చెప్పేసాయి. చివరగా ఆ తల్లీ బిడ్డా పోలీష్ స్టేషన్ కి చేరుకుని కంప్లైంట్ చేశారు. పిల్లల ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని, పాప తండ్రి ని కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రాణం గా కూతుర్లని కాపాడుకునే తండ్రులు ఉన్న చోటే ఇలాంటి దారుణాలు జరగడం బాధాకరం.