భారతదేశ మిలిటరీలో నవశకం ఇది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రఫెల్ యుద్ధ విమానాలు కొద్దిసేపటి క్రితం అంబాలా ఎయిర్ బేస్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. అబుదాబిలోని ఆల్ దఫ్రా సైనిక స్థావరం నుండి 5 యుద్ధ విమానాలు భారత భూభాగంపై ల్యాండ్ అయ్యాయి.
దీంతో భారత అమ్ముల పొదిలో అత్యాధునిక యుద్ధ విమానాలు చేరినట్లయింది. రఫెల్ యుద్ధ విమానాల వల్ల మన సామర్ధ్యం మరింత దుర్బేధ్యంగా మారినట్లైంది. ఎయిర్ఫోర్స్ శక్తి సామర్థ్యాల్లో ఈ యుద్ధ విమానాలు విప్లవాత్మక మార్పులు తెస్తాయని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. మొదటి బ్యాచ్లో భాగంగా ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి. ఆగస్టులో రెండో విడతగా మరికొన్ని యుద్ధ విమానాలు రానున్నాయి.