ఒక పక్క కరోనా మహమ్మారి ప్రపంచంలోని దేశాలను వణికిస్తోంది. నేటికి 60 లక్షల 57వేల మందికి పైగా కొవిడ్ 19 వైరస్ బారిన పడగా 3 లక్షల 67 వేల 312 మంది మృతి చెందారు. 26 లక్షల 87 మందికి పైగా వైరస్ బారి నుండి విముక్తి కాగా మారో 30 లక్షల కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా కట్టడికి అన్ని దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో వివిధ దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం వందేమాతరం మిషన్ పేరుతో ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది.
రష్యా లోని మాస్కో నుండి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానాన్ని పంపింది. అయితే ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది. ఆ విమానం బయలుదేరిన రెండు గంటల తరువాత ఆ విమాన పైలట్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులకు సమాచారం తెలిసింది. దీనితో వారికి చెమటలు పట్టాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి అనుమతితో హుటాహుటిన ఆ విమానాన్ని వెనక్కు రప్పించారు. ఆ తరువాత అధికారులు మారో విమానాన్ని మస్కో పంపించారు.
సాధారణంగా అయితే పైలట్ కు కరోనా టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తరువాతే విమానం నడిపేందుకు అనుమతి ఇస్తారు. అదే మాదిరిగా పైలట్ కు కరోనా టెస్ట్ పూర్తి చేశారు. రిపోర్ట్ పరిశీలించారు. అయితే అక్కడే పొరపాటు జరిగింది. రిపోర్ట్ పరిశీలన సమయంలో అధికారులు తొలుత నెగిటివ్ గా నిర్ధారణకు వచ్చారు. అ తరువాత జరిగిన పొరపాటు ను గురించి విమానాన్ని వెనక్కు రప్పించారు. కరోనా పొజిషన్ నిర్ధారణ అయిన సదరు పైలట్ ను ఆసుపత్రికి తరలించారు.సహచర ఉద్యోగులను క్వారంటైన్ కు పంపారు. ఆ విమానాన్ని పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు.