మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. స్థానిక బాప్టిస్ట్ పేటలో ఓ సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను గాలికి వదిలేశారు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను గాలికి వదిలేసి ఈ రిబ్బన్ కట్టింగులు ఎందుకంటూ స్థానికులు ఆయన్ను ప్రశ్నించారు.
అయితే.. రామకృష్ణారెడ్డిని అడ్డుకుంది పలు కుల సంఘాల నాయకులని తెలుస్తోంది. విద్యుత్ సబ్ స్టేషన్ ను తమ ప్రాంతంలో నిర్మించొద్దని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారు శంకుస్థాపన ప్రాంతంలో నిరసనకు దిగారు. అయినా.. ఎమ్మెల్యే, అధికారులు శంకుస్థాపన సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయడంతో కోర్టుకు వెళ్తామని వారు హెచ్చరించారు.