కరోనా కట్టడి దిశగా ఢిల్లీ ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘ప్లాస్మా బ్యాంక్’ నుమొదలు పెడుతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఈ బ్యాంకును మొదలు పెడుతున్న మొదటి రాష్ట్రంగా ఢిల్లీ అవతరించనుంది. ఈ ఆపరేషన్ కొరకు కరోనా నుండి కోలుకున్న వారందరూ వచ్చి తమ రక్తంలోని ప్లాస్మా ను డొనేట్ చేయవలసిందిగా కేజ్రీవాల్ కోరారు.
కరోనా నుండి కోలుకొని వారి ప్లాస్మా ను ప్రస్తుతం కరోనా తో బాధపడుతున్న వారికి ఎక్కించినట్లు అయితే వారిలో రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ ను త్వరగా అంతం చేయవచ్చు అని సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఇది ఇప్పటికీ చాలా దేశాల్లో ఇది మంచి రిజల్ట్స్ ఇస్తోంది. భారతదేశంలో కూడా చాలా వరకు దీనివల్ల పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి.
అంతేకాకుండా ఈ ప్లాస్మా బ్యాంకు కు సంబంధించి 29 పేషెంట్లు పైన ఢిల్లీ ప్రభుత్వం ముందే ట్రయల్స్ వేసింది. వారికి కొన్ని ఉత్తేజకరమైన రిజల్ట్స్ బయటకు రావడం గమనార్హం. ఎంతో ప్రోత్సాహకంగా రికర్వరీ రేట్ దాదాపు 95 శాతం ఉందని కేజ్రీవాల్ వెల్లడించారు. కాబట్టి ఈ కీలక ముందడుగు లో నుండి కరోనా నుండి కోలుకున్న వారంతా పాల్గొని వచ్చి…. తమ అమూల్యమైన భాగస్వామ్యాన్ని తెలపాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు.