బిగ్ బాస్ 4.. ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. గత మూడు సీజన్లకు కూడా ఇంత హైప్ రాలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా.. బిగ్ బాస్ గురించే చర్చ. దసరా సందర్భంగా సమంత హోస్ట్ చేసి.. ఆ షోను ఎక్కడికో తీసుకుపోయింది. నాగార్జున కూడా హోస్టింగ్ అదరగొడుతున్నారు. మొత్తం మీద ఈ సీజన్ కూడా సక్సెస్ అయినట్టే. నో డౌట్.
అయితే.. సోషల్ మీడియా ప్రభావం.. బిగ్ బాస్ మీద చాలా పడుతోంది. ఎందుకంటే.. కుమారు సాయి, దేవి నాగవల్లి, దివి.. లాంటి కంటెస్టెంట్ల ఎలిమినేషన్ లో ప్రేక్షకుల ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదని.. ప్రేక్షకుల ఓట్లను పరిగణనలోకి తీసుకోనప్పుడు.. ఎందుకు ఓట్లేయాలంటూ అంత పెద్ద హడావుడి ఎందుకు? అంటూ నెటిజన్లు మండిపడుతున్న విషయం తెలిసిందే.
అదంతా పక్కన పెడితే.. హౌస్ లో ప్రస్తుతం ఉన్నవాళ్లలో అందరికీ.. ఒకరిద్దరికి తప్ప.. అమ్మ రాజశేఖర్ మాస్టారు టార్గెట్ అయిపోయాడు. నోయల్ కూడా పోతూ పోతూ.. అమ్మ రాజశేఖర్ పరువంతా తీసేసి వెళ్లిపోయాడు. దీంతో హౌస్ లో కూడా అమ్మకు యాంటీ అయిపోయారు అందరూ.
నిజానికి గత వారమే అమ్మ రాజశేఖర్ బయటికి వెళ్లిపోయేవాడు కానీ.. నోయల్.. తాను వెళ్లిపోయాను కాబట్టి.. ఆ వారం ఎలిమినేషన్ వద్దు.. అంటూ చెప్పాడని నాగార్జున చెప్పాడు. సరే.. అది కూడా పక్కన పెట్టేద్దాం.
ఆదివారం నాటి ఎపిసోడ్ లో చివరకు మెహబూబ్, అమ్మ రాజశేఖర్ మాత్రమే ఎలిమినేషన్ కోసం మిగలగా.. ఇద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారు.. అంటే ఉన్న 8 మందిలో ఆరుగురు అమ్మనే ఎలిమినేట్ చేస్తాం అన్నారు. ఇద్దరు మాత్రమే మెహబూబ్ ను ఎలిమినేట్ చేస్తామన్నారు.
అంటే.. హౌస్ మొత్తం రాజశేఖర్ కు యాంటీ అయిపోయింది. దానికి కారణం లేకపోలేదు. ఆయన అందరితోనూ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడేయడం.. ఎవరైనా తనను నామినేట్ చేసినా.. తనను నామినేట్ చేస్తాడా? నేను జన్మలో మాట్లాడను.. అంటూ చెప్పడం.. కొన్ని విషయాల్లో తనదే నెగ్గాలని అనుకోవడం… తొందరగా కోపం రావడం లాంటివి అమ్మ రాజశేఖర్ మైనస్ లు. వాటి వల్లనే ఆయన హౌస్ లో బ్యాడ్ అయిపోయాడు. ప్రస్తుతం హౌస్ మెట్స్ టార్గెట్ అయిపోయాడు.
దీంతో ఈ వారం గనుక అమ్మ రాజశేఖర్ నామినేషన్స్ లోకి వస్తే.. నో డౌట్.. అమ్మను ఈసారి ఎలిమినేట్ చేస్తారు.. ప్రేక్షకులు కూడా అమ్మ ప్రవర్తనతో విసిగిపోయారని వార్తలు వస్తున్నాయి. చూద్దాం.. ఈ వారం మరి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడా? లేదా?