కోవిడ్-19 ప్రస్తుతం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పలు కార్యక్రమాలు రద్దవుతున్నాయి. ప్రతీ ఏడాది రాష్ట్రంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు లేదా సంస్థలకు అందించే అన్ని రకాల అవార్డులను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతిని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. సాంపుల్ టెస్ట్ ల సంఖ్యను కూడా బాగా పెంచింది. అయినా కూడా ఇప్పటికే ఉధృతి పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోక తప్పట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విశిష్ట సేవలందించిన వ్యక్తులకు లేదా సంస్థలకు ఇచ్చే అవార్డులను రద్దు చేసారు.