Anchor Suma: స్టార్ యాంకర్ సుమ,ఆమె భర్త కనకాల రాజీవ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు.సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వారిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.కనకాల రాజీవ్ తండ్రి దివంగత కనకాల దేవదాస్ చేతిలో ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో తాను మోసపోయానని అన్నపూర్ణమ్మ మీడియాకు తెలిపారు.దేవదాస్ మరణానంతరం ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా తాను ఆయన కొడుకు రాజీవ్, కోడలు సమంతను ప్రాధేయపడ్డా ఫలితం లేకుండా ఉందన్నారు.
అన్నపూర్ణమ్మ చెబుతున్నదేమిటంటే!
తాను చెన్నైలో ఉండగా ఇరవై రెండేళ్ల క్రితం దేవదాస్ కనకాల వద్ద నుండి ఒక భూమిని కొన్నానని ఆమె చెప్పారు.అయితే తనకు అమ్మిన భూమినే మళ్లీ దేవదాస్ కనకాల మరో వెంచర్లో వేరేవారికి అమ్మేశారని ఆమె వాపోయారు.దేవదాస్ కు తనకు దూరమైన విషయం వారి కుటుంబ సభ్యులకు అందరికీ తెలుసునన్నారు.అయితే ఆయన మరణానంతరం తమకేమీ తెలియనట్లు నటిస్తున్నారని ఆమె ఆరోపించారు.
నా ఫోన్ నంబర్ రాజీవ్ బ్లాక్ చేశాడు!
ఒకసారి రాజీవ్ కనకాలకు ఫోన్ చేసి తన సమస్యను వివరించానని ఆమె చెప్పారు.తనకు చేతనైనంత వరకు న్యాయం చేస్తానని అప్పుడు రాజీవ్ హామీ ఇచ్చాడన్నారు.ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఆయనకు ఫోన్ చేసినా బిజీబిజీ అని వస్తోందన్నారు.దీంతో తనకు అనుమానం వచ్చి ఒక మధ్యవర్తి కి ఈ విషయం చెప్పి రాజీవ్ మీ నెంబర్ బ్లాక్ చేశాడని ఆయన సమాధానమిచ్చారని ఆమె తెలిపారు.అంతేగాక మధ్యవర్తి ఈ విషయమై రాజీవ్ తో మాట్లాడితే తనకేమి తెలియదు,తనకేమీ సంబంధం లేదని కూడా తేల్చి చెప్పాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
అన్ని విషయాలు వారికి తెలుసు!
దేవదాస్ కనకాల చేతిలో తాను మోసపోయిన విషయం ఆయన కుటుంబ సభ్యులు అందరికీ తెలుసునని అన్నపూర్ణమ్మ చెప్పారు.ఒకసారి తనకు దేవదాస్ కు గొడవ జరిగినప్పుడు రాజీవ్ ,సుమలు కూడా అక్కడే ఉన్నారన్నారు.ఇప్పుడు దేవదాస్ మరణానంతరం అందరూ ప్లేటు తిప్పేశారని ఆమె పేర్కొన్నారు.పోతే పోనివ్వండి ఆ భూమిని పట్టుకొని నేను పైకి పోతానా?రాజీవ్,సుమలు ఆ భూమ్మీద ఇక్కడే ఉంటారా అంటూ ఆమె వైరాగ్యం ప్రదర్శించారు.అందరంపైకి పోయేవాళ్లమే.. ఆ విషయం వారు తెలుసుకోవాలని ఆమె రాజీవ్ సుమలకు హితోపదేశం చేశారు.ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు ఫీల్డులో వివాదరహితులుగా ఉన్న రాజీవ్,సుమల ఇమేజ్ కి అన్నపూర్ణమ్మ ఎపిసోడ్ వల్ల డ్యామేజ్ జరుగుతుందనే చెప్పక తప్పదు..