Nithin : నితిన్ నటించబోతున్న మరో సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. గత ఏడాది భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్న నితిన్ వరసగా సినిమాలను లైన్ లో పెట్టారు. అన్నీ సినిమాలు ఒకదానికి ఒకటి భిన్నమైన కథలతో తెరకెక్కుతున్నాయి. అంతేకాదు అన్నీ సినిమాలని లైన్ గా రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో నితిన్ చెక్ సినిమాతో రాబోతున్నాడు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. రకుల్ ప్రీత్ సింగ్ – ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మార్చ్ 26 న రంగ్ దే సినిమా రిలీజ్ కాబోతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా దాదాపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ .. లిరికల్ సాంగ్ సినిమా మీద బాగానే అంచనాలు పెంచాయి. చెక్ రిలీజైన నెల రోజులలోనే రంగ్ దే సినిమాని రిలీజ్ చేస్తుండటం విశేషం.
Nithin : నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ అన్న సినిమా చేయబోతున్నాడు..!
కాగా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నితిన్ కి జంటగా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. జూన్ 11న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో తాజా చిత్రాన్ని నితిన్ సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడు. యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ అన్న సినిమా చేయబోతున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ మూడు గెటప్స్ లో కనిపించబోతున్నాడట. కాగా త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!