Flash News: ఈరోజు ఉదయం సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ జల వివాదంపై క్యాబినెట్ చర్చించడం జరిగింది. చర్చలో భాగంగా ఏపీ సీఎం జగన్ తెలంగాణ మంత్రులపై షాకింగ్ కామెంట్లు చేయడం జరిగిందట. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ మంత్రులు దూకుడుగా వ్యవహరిస్తున్న సమయం పాటించడం వెనకాల గల కారణం.. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉండటమేనని జగన్ అన్నారట.
ఏదైనా అయితే వాళ్ళ పై దాడి చేస్తారేమో అన్న భావనతో.. సమయమనం పాట్టిస్తున్నట్లు మంత్రులకు తెలియజేశారు అట. తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని.. జగన్ సీరియస్ అయ్యారట. ఈ ఈ విషయంలో ఆలోచించి వ్యవహరించాలని మంత్రులకు జగన్ సూచించినట్లు సమాచారం. అంతమాత్రమే కాకుండా కృష్ణానది జలాల బోర్డు మరోసారి తెలంగాణ వ్యవహరిస్తున్న తీరుపై లెటర్ రాయాలని క్యాబినెట్ మంత్రులతో జగన్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా నీటి జల వివాదం విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ పంచాయతీ రాబోయే రోజుల్లో మరింత పెద్దది అయ్యేటట్లు కనిపిస్తుంది.