Eatela Rajendar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ మాజీ సహచరుడు, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్ గత కొద్దికాలంగా ప్రభుత్వంపై విమర్శల దూకుడు పెంచుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన మరో కొత్త అంశంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్దికాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న దళిత సంక్షేమ ఎజెండాపై ఈటల స్పందించారు. కేసీఆర్ నిర్ణయాల వెనుక లెక్క వేరే అని ఆరోపించారు.
Read More: Eatela Rajendar: ఈటల సంచలన వ్యాఖ్యలు.. దొర అంటూ కామెంట్లు
ఈటల ఏమంటున్నారంటే…
కేసీఆర్ టక్కు టమారా విద్యలు ఇక చెల్లవని.. తెలంగాణ ప్రజలు మీ మాటలపై విశ్వాసం కోల్పోయారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తానని, లేకుంటే తల నరక్కుంటానన్న కేసీఆర్.. ఆ పదవి ఇవ్వకపోగా.. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తొలగించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. దళితలకు పాలించే నైపుణ్యం, తెలివి లేదని అవమాన పరిచారని.. రాష్ట్రంలో 16 శాతం ఎస్సీలుంటే.. కెేబినెట్ లో ఆ వర్గం వాళ్లు ఎందరు మంత్రులున్నారన్నారు. వాళ్ల బాధలు, వాళ్లకే తెలుస్తాయని మంత్రివర్గంలో వాళ్లకు ప్రాధాన్యత ఉండాలని చెప్పేవారు కేసీఆర్ అన్నారు. గతంలో మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరుంటే, ఇప్పుడు మాల సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చారన్నారు. చెరో మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆయనకు లేకుండా అవమానించారని.. ఎన్నడూ లేనిది సీఎం దళితలపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సీఎం కార్యాలయమే కేంద్ర బిందువు అన్నారు. అలాంటి సీఎంవో ఆఫీసులో దళిత, గిరిజన, బీసీ ఐఎఎస్ అధికారులకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ఈ జాతులకు తెలివి లేదనే.. అక్కడ అవకాశం ఇవ్వకుండా అవమానించారని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More:
హుజురాబాద్లో గెలుపు ఏవరిదంటే…
హుజూరాబాద్ లో ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. యావత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపేలా హుజూరాబాద్ ప్రజలు తీర్పునియ్యాలన్నారు. 18 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని చెప్పారు. TRS వాళ్లు పంచే డబ్బు సంచులకు ఆశలకు ఇక్కడి ప్రజలు లొంగరన్నారు. హుజురాబాద్ ఎన్నికే లేకపోతే కేసీఆర్ ఫాంహౌస్ దాటి వచ్చేవాడా అని ప్రశ్నించారు.