Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ రథసారథిగా నియమితుడైన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కంటే ముందే తన గేమ్ మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ కు ఈ పగ్గాలు అప్పగించగా ఆ కార్యక్రమంతో పాటుగా మరో ఎత్తుగడకు సైత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్ ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి అఉట టీఆర్ఎస్ పార్టీకి కీలక సందేశం అందించారు.
Read More: Revanth Reddy: రేవంత్ దూకుడు మొదలైందిగా… అప్పుడే కేటీఆర్ విషయంలో…
రేవంత్ ఏమంటున్నారంటే…
తనది కాంగ్రెస్ కుటుంబమని, తాను సోనియా గాంధీ మనిషినని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ను ఎదుర్కునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రావణాసురుడ్ని ఎదుర్కోవడానికి వానర సైన్యం ఎలా పని చేసిందో.. కేసీఆర్ను దించడానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అదే విధంగా పని చేయాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులని ఆరోపించారు. అమరవీరుల స్థూపాన్ని కూడా వాళ్లు వదల్లేదని.. దాంట్లోనూ కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపించిన రేవంత్ రెడ్డి త్వరలోనే ఆధారాలతో బయట పెడతానని సంచలన ప్రకటన చేశారు.
Read More: KCR: కేసీఆర్ అవాక్కయ్యేలా చేస్తున్న కాంగ్రెస్
వాళ్లు చస్తేనే…
ఎవరన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోతేనే పథకాలు పక్కాగా అమలవుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. “సమాజంలో సగభాగం ఉన్న బీసీల కోసం బడ్జెట్లో 3 శాతం కేటాయిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా రావడం లేదు. గతంలో దుబ్బాక, సాగర్.. ఇప్పుడు హుజూరాబాద్లో పథకాలు అమలవుతున్నాయి. 1.91 లక్షల ఉద్యోగాల భర్తీ కూడా చేయడం లేదు. దీని వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలు బాగా నష్టపోతున్నారు. కరోనా కంటే కేసీఆర్ డేంజర్.` అని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.