Eatela Rajendar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన దూకుడు పెంచారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో కీలక కామెంట్లు చేశారు. దమ్ముంటే మీ సిద్ధాంతం చెప్పుకోండి కానీ, ఘర్షణలకు దిగితే సహించేది లేదని అధికార పార్టీని హెచ్చరించారు. టీఆర్ఎస్ పాలనలో అక్కడొక దొర, ఇక్కడొక దొర ఉన్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.
Read More: Eatela Rajendar: ఈటల గేమ్ మొదలైంది… ఆయన కోసం ఎవరు వచ్చేశారో తెలుసా?
ఈటల ఫైర్
హుజురాబాద్ లో ఎన్నికలు జరిగినప్పుడు గతంలో ఏనాడు కూడా ప్రలోభాలు, లిక్కర్ పంపిణీలకు తాము అవకాశం ఇవ్వలేదని ఈటల తెలిపారు. కుల సంఘాల సమావేశాలు పెట్టి, అంగట్లో మాదిరిగా అమ్మకం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్ టీఆర్ఎస్కు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ అధికారులను కూడా కేసీఆర్ తనకు బానిసలుగా చేసుకున్నారని మండిపడ్డారు. బానిసలుగా మారిన వారికే పదవులు వస్తాయనే దౌర్భాగ్య పరిస్థితి కేసీఆర్ కల్పించారని ఆరోపించారు.
Read More: Eatela Rajendar: ఈటల కు అప్పుడే బీజేపీలో పొగ పెడుతున్న సీనియర్
సహించేది లేదు…
హుజురాబాద్ నియోజకవర్గం లో రెండున్నర ఏళ్లుగా అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఇస్తా అని చెబుతుండటం ఎన్నికల కోసమేనని, దీన్నే చిల్లర రాజకీయం అంటారని ఈటల మండిపడ్డారు. తాము ఎవరి జోలికి వెళ్లే వాళ్లం కాదని…ఈ 20ఏళ్లలో ఎప్పుడు వివాదాలకు తావు ఇవ్వలేదని ఈటల తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు సాగడం హుజురాబాద్ ప్రత్యేకత అని ఈటల తెలిపారు. దమ్ముంటే మీ సిద్దాంతం చెప్పుకో, ఓట్లు అడుగు… కానీ ఘర్షణలకు దిగుతామంటే మాత్రం సహించేది లేదని ఈటల తెలిపారు.