(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏ పి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులకు గానూ నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్మోహనరెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. అది ఏమిటంటే..ఇక పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్ లో విద్యార్థులకు సంబంధించిన కులం, మతం ప్రస్తావన ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు సీ ఎం జగన్. ఈ మేరకు ప్రభుత్వం నేడు జివో విడుదల చేసింది.
ఇకపై విద్యార్థుల్లో కుల, మత ప్రస్తావన రాకూడదనే ఉద్దేశంతో ఆ వివరాలను అటెండెన్స్ బుక్లో తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే స్కూల్ రికార్డులో మాత్రం వీటిని నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే విద్యార్థుల కులం, మతాల ఆధారాలు అందుబాటులో ఉండనున్నాయి. రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు, ఇతర రాయితీలు పొందేందుకు గానూ రికార్డుల్లో మాత్రమే వీటిని పొందుపరుస్తారు.సీ ఎం జగన్మోహన రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.