(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
టీ టీ డీ నూతన కార్యనిర్వహణ అధికారి (ఈవో)గా జవహర్ రెడ్డి నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాలం వరకూ టీ టీ డీ ఈ వోగా బాధ్యతలు నిర్వహించిన అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేక కార్యదర్సిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన గురువారం లేదా శుక్రవారం టీటీడీ నూతన ఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయిన తరువాత ఎఈఓ ధర్మారెడ్డి ఇన్ చార్జి ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనిల్ కుమార్ సింఘాల్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసు నుండి డిప్యూటేషన్ పై వచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కూడా ఏడాదిన్నరగా అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా పని చేశారు. అయితే ఇటీవల తిరుమలలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనను బదిలీ చేసినట్లు భావిస్తున్నారు.