అమరావతి : కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊరట కల్గించే వార్త చెప్పింది. ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి వారికి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించనున్నది. ఈ మేరకు ఆర్ధిక, ఖజానా శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ట్రెజరీ సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గడిచిన రెండు నెలల బకాయిలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.