న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ నెల ఆఖరికి భారీ స్థాయిలో మద్యం అమ్ముడు పోతుంది అన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. మరోపక్క కరోనా దెబ్బ కి బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్ లు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులో మందుబాబుల ను పట్టుకోవడం కోసం పోలీసులు సరికొత్త ఐడియా అమలులోకి తీసుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే మందు తాగే ప్రతి ఒక్కరికి కళ్లు ఎర్రబడటం మాత్రమే కాక అధిక మోతాదులో మందు సేవిస్తే ఆ వ్యక్తి సరిగ్గా నిలబడలేక పోవటం మాత్రమే కాక అడుగులు కూడా వేయలేకపోతరు. ఇటువంటి నేపథ్యంలో మందుబాబుల ను పట్టుకోవడం కోసం పోలీసులు వేళ్ళు లెక్కపెట్టమనడం, గీత గీసి… ఆ గీతపై నడవమని చెప్పడం వంటివి చేస్తున్నారు.
అధికంగా మద్యం సేవించిన వ్యక్తులు నిటారుగా ఉండే గీతపై నడవడం అంటే కష్టమే. దీంతో ఎవరైనా అధిక మోతాదులో మద్యం సేవించినట్లు అక్కడ దొరికితే మాత్రం వాళ్లను హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్షలు చేసి భారీ స్థాయిలో ఫైన్ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క కొత్తరకం కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు న్యూ ఇయర్ వేడుకలు ఆపేయాలని కర్ఫ్యూ విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.