ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ రాశారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరుస్థితుల నేపథ్యంలో బాలయ్య రాసిన ఈ లేఖ రాజకీయంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.
హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని బాలయ్య సీఎం జగన్ ను లేఖలో కోరారు. హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని, కర్ణాటక రాజధాని బెంగళూరు కి దగ్గరగా ఉండటంతో పాటు అనువైన స్థలం కూడా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
సీఎం జగన్ తో పాటు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి కూడా బాలకృష్ణ లేఖ రాసారు. మరోవైపు మెడికల్ కళాశాల వివాదంపై కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కి లేఖ రాశారు. హిందూపురం సమీపంలోని మలుగూరు వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
మెడికల్ కళాశాల ఏర్పాటుకు హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. హిందూపురం లో జనాభా, ఇతర అవసరాల దృష్ట్యా మెడికల్ కళాశాల అవసరం ఉందని బాలకృష్ణ తెలిపారు.