కరోనా పుణ్యమా అంటూ సిల్వర్ స్క్రీన్ కి గట్టి దెబ్బ తగిలింది. ల్యాబ్ లో ఉన్న సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయో తెలీదు. నిర్మాణంలో ఉన్న సినిమాలు ఎప్పుడు కంప్లీటవుతాయో తెలీదు. కొత్త సినిమాలకి ఎప్పుడు కొబ్బరి కాయకొడతారో క్లారిటీ లేదు. ఇన్ని సమస్యలు ఒక్క కరోనా మూలాననే. ఇదే అదును చూసుకొని ఓటీటీ ప్లాట్ ఫాం అంటూ అమెజాన్ …నెట్ ఫ్లిక్స్ లాంటివి దూసుకొచ్చాయి. చిన్న …మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించిన మేకర్స్ కి కాస్త ఊరట నిచ్చాయి.
చాలా వరకు సినిమాలు ఈ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలే కాదు చెప్పాలంటే బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళవి ఓటీటీ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మన తెలుగులో అయితే ఇంకా అంత పెద్ద సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దం గా లేరు. కాని కొత్త వాళ్ళతో రూపొందించినవి రిలీజవుతున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ నిర్మాత తన ఆహా యాప్ లో వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వరసగా ప్రముఖుల తో వెబ్ సిరీస్ ను నిర్మించి రిలీజ్ చేయనున్నారు. ఈ రంగంలోకి మెగాస్టార్ తనయుడు రాం చరణ్ కూడా ఎంటరవనున్నాడట.
అయితే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నారట. ఆయనే నిర్మాతగా ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తారని తెలుస్తుంది. తన దగ్గర సహయాకుడిగా ఉన్న ఒక వ్యక్తిని దర్శకుడిగా పరిచియం చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాని రూపొందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రాం చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. ఇక కొరటాల ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ కారణంగా కొంతమంది మేకర్స్ అడిగినట్టు స్క్రిప్ట్ లో సహాయం చేస్తూ కూడా సంపాదిస్తున్నారట.