వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మండపాల్లో లడ్డూ వేలం పాటలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని, రికార్డును నెలకొల్పుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో వేలు, లక్షల్లో పోటీపడి మరీ గణపతి లడ్డూను దక్కించుకుంటున్నారు. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డూ వేలం పాటే ఒక రికార్డు ఉండగా, నేడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ అల్వాల్ గణనాధుడు నిలిచారు. మాదాపూర్ లో 20లక్షలకు పైగా లడ్డూ వేలం పాట జరగ్గా, బాలాపూర్ లడ్డూకు రూ.24లక్షలకుపైగా వేలం జరిగింది.
భారీ గణనాధుడికి పొంచి ఉన్న ప్రమాదం .. అప్రమత్తమైన అధికారులు.. ఎక్కడంటే..?
ఈ రోజు అల్వాల్ కనాజీగూడలో మరకత శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో గణపతి నవరాత్రుల లడ్డూకు వేలం పాట హోరాహోరీగా జరిగింది. వెంకట్రావు అనే భక్తుడు గణపతి లడ్డూను రూ.45,99,999లకు వేలంలో చేజిక్కించుకున్నారు. అక్షరాలా ఒక్క రూపాయి తక్కువ రూ.,46లక్షలకు లడ్డూ వేలం జరగడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే రికార్డు. అయితే మునుపెన్నడూ లేని విధంగా అల్వాల్ పరిధిలోని కానాజీగూడ మరకత శ్రీ లక్షీ గణపతి ఆలయంలో భారీ గణనాధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో జరిగిన లడ్డూ వేలం పాటకు హోరాహోరీగా పాటదారులు పాల్గొనడంతో రికార్డు నెలకొంది.
రికార్డు సృష్టించిన బాలాపూర్ గణేష్ లడ్డూ..వేలంలో ఈ సారి ధర ఎంత పలికింది అంటే..?