Bandla Ganesh: దేశంలో కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. అనేక మంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉండి వచ్చిన బండ్ల గణేష్ నేడు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ వేదికగా గణేష్ వెల్లడించారు. తాను హోం క్వారంటైన్ అయినట్లు పేర్కొన్నారు. కరోనా టెస్ట్ రిపోర్టును ట్యాగ్ చేశారు.
బండ్ల గణేష్ కు కరోనా సోకడం ఇది ప్రధమం కాదు. గతంలోనూ కరోనా బారిన పడి చికిత్స పొంది కోలుకున్నారు. ఇప్పటికే టాలివుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటి త్రిష, మంచు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కరోనా బారిన పడి హోం క్వారంటైన్ లో ఉన్నారు. జాగ్రత్తలు పాటిస్తున్న వారు కరోనా బారిన పడుతున్నారు. సినీ సెలబ్రెటీలు కరోనా బారిన పడుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!