అస్తమానం మనుషులు చేసే రెజ్లింగ్ ఏం చూస్తారు.. కాసేపు మా రెజ్లింగ్ కూడా చూడండి.. అని అనుకున్నాయో, లేదో తెలియదు కానీ.. ఆ ఎలుగుబంటి పిల్లలు మాత్రం సరదాగా కాసేపు కుస్తీ పట్టాయి. పార్కులో ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ రెజ్లింగ్ చేశాయి. ఆ సందర్భంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అమెరికాలోని టెక్సాస్ బిగ్ బెండ్ నేషనల్ పార్క్లో రెండు ఎలుగుబంటి పిల్లలు తమ తల్లి ఎదుటే కుస్తీ పట్టాయి. పార్కులో అటు, ఇటు తిరుగుతూ రెజ్లింగ్ చేశాయి. ఆ సమయంలో తీసిన వీడియోను డాక్టర్ జో హాన్సన్ అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశాడు. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారింది. దీనికి ఇప్పటికే 7 లక్షలకు పైగా వ్యూస్, 38వేలకు పైగా లైక్లు వచ్చాయి.
One of the greatest things that has happened as a result of this pandemic is these black bears wrasslin' on the patio of Big Bend National Park basin lodge because all the humans are gone pic.twitter.com/rWkqqzjN1b
— Joe ?=? Hanson (@DrJoeHanson) June 28, 2020
ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఈ వీడియో ఎంతో ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇచ్చిందని కొందరు అంటుంటే.. మనుషులు అసలు లేకపోతేనే ఈ ప్రాణులకు బాగుంటుందని.. కొందరు అంటున్నారు. ఇక కొందరైతే.. ఎలుగుబంటి, దాని పిల్లలు ఆహారం లేక పూర్తిగా బక్క చిక్కిపోయాయి.. ఆహారం పెట్టండని కామెంట్లు చేస్తున్నారు.