Bathing: ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు ప్రతి రోజూ స్నానం Bathing చేస్తారు. కొందరైతే రోజుకు 2 సార్లు స్నానం చేయకుండా ఉండలేరు. అయితే స్నానం చేయడం వల్ల ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకుందాం. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్ర పడడమే కాదు, గుండె కు మేలు కలుగుతుందని పరిశోధకులుతెలియచేస్తున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్నానం చేస్తే గుండె పోటు , గుండె కు సంబందించిన రోగాలు వచ్చే అవకాశం తగ్గుందని సూచిస్తున్నారు .
కొన్ని అధ్యయనాల ప్రకారం గోరు వెచ్చని నీరు గుండె ఆరోగ్యానికి మేలు అని చెబుతున్నాయి. రెండుపూటలా గోరు వెచ్చ టి నీరు శరీరం మీద పడితే, శారీరక అలసట దూరమై , మానసిక ప్రశాంతత పొందవచ్చు . గోరు స్నానం కోసం వెచ్చని నీరు ఉపయోగించడం వలన గుండెకు రక్త ప్రసరణబాగా జరిగే అవకాశం ఉందట.ఎవ్వరైతే టబ్లో స్నానం చేస్తారో వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ . రాత్రి స్నానం చాలా ప్రశాంతం , త్వరగా నిద్ర పోవడానికి కూడా కారణమవుతుంది. రాత్రిపూట పడుకునే ముందు స్నానం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది.
రాత్రి సమయం లో మాములు నీళ్లతో కంటే కూడా గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి . వాటిగురించి తెలుసుకుందాం. రాత్రి సమయంలో గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే త్వరగా నిద్ర పోతారు . నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు, పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయడం వలన సమస్య తగ్గుతుంది .
కండరాలు విశ్రాంతిని పొందలన్న కూడా, గోరు వెచ్చని నీళ్లతో స్నానంచేయడం అవసరం రక్తపోటును అదుపు లో ఉండాలన్న, రాత్రిళ్ళు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు టైపు 2 డయాబెటిస్ ఉన్నవారు కూడా గోరువెచ్చని నీటి తో స్నానం చేయడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది . ఒకవేళ నీటి సమస్య ఉంటే, రెండు రోజులకు ఒక్కసారైనా స్నానం చేసేలా చూసుకోవాలి.