తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఏడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 2 నుండి 10 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు బట్టి విక్రమార్క.
త్వరలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల నోటిఫికేషన్ అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం హడావిడి చేస్తుందని సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ లో చాలా ఖాళీల ఉద్యోగాలు ఉన్నాయని ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు.
అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదని.. దీంతో రాష్ట్రంలో 20 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ పత్రిక ప్రకటనలతో టిఆర్ఎస్ సర్కార్ సరికొత్త నాటకానికి తెర లేపుతున్నారు అని విమర్శించారు. గతంలో 16వేల కానిస్టేబుల్ పోస్ట్ లు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అని పిలిచి.. సెలెక్ట్ అయిన వారిని ఈనాటి వరకు కోచింగ్ కి పంపించలేదని.. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనలు కూడా అలాంటివే అంటూ భట్టి విక్రమార్క టిఆర్ఎస్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.