కరోనా కంట్రోల్ కావడం లేదు. టాప్ 10లో ఉండే భారత్ మెల్లిమెల్లిగా ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరువైంది. ఇంకొద్ది రోజులు పోతే అగ్రస్థానంలో ఉన్న అమెరికాను బీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అసలే 135కోట్ల జనాభా.
ఇక్కడ కరోనా సోకితే మరణ మృదంగమే.. ‘‘టెస్టులు భారీగా చేయడం లేదు కానీ.. భారత్-చైనాలో గనుక అమెరికాలో లాగా వైరస్ పరీక్షలు చేస్తే అవి రెండూ మా దేశాన్ని దాటిపోతాయని’’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు కరోనా టెస్టులు చేయకుండా లక్షణాలు బయట పడ్డ వారికే చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శ ఉంది. అందరికీ పరీక్షలు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున కేసులు బయటపడడం ఖాయం.ఇప్పుడు అన్ని సడలించిన వేళ.. వైరస్ మరింతగా వ్యాపించడం తథ్యం. మరి 135 కోట్ల భారత దేశంలో ఆ మహమ్మారి సోకితే ఆస్పత్రులేవీ సరిపోవు. చికిత్సలు చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రి నిండిపోయింది. మహారాష్ట్రలో అయితే కేసుల్లో చైనాను దాటేసింది. అక్కడ ఊహకందని విధ్వంసం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయట..దేశంలో పెద్ద ఎత్తున కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉంటే వాటిని తట్టుకునే కెపాసిటీ భారతదేశానికి లేదు అని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. జూన్ 25కల్లా ఊహించనివిధంగా కేసులు పెరుగుతాయి అని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మరో 2 వారాల తర్వాత లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని అని జాతీయ మీడియా సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. కేంద్రం లాక్ డౌన్ ను దేశంలో మళ్లీ పెట్టినా రాష్ట్రాలు ,జనాలు పాటిస్తాయా లేదా అన్న అనుమానాలున్నాయి.