బిగ్ బాస్ ఇంటిలో రోబో టాస్క్ లో గొడవ జరిగిన సందర్భంలో సయ్యద్ సోహెల్ చాలా కంగారులో కనిపించాడు. గొడవ పడడం వల్ల తన పైన ప్రభావం చూపుతుంది అని తీవ్రంగా మదనపడ్డాడు. అప్పటినుండి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సోహెల్ తన కోపాన్ని క్రమ కంట్రోల్ చేసుకున్నాడు అని చెప్పవచ్చు. మధ్యలో నాగార్జున కూడా మందలించాడు ఆ తర్వాత కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ అయిపోయాడు
అలాంటి సోహెల్ తన మంచితనం తోనే ఫైనల్స్ దరిదాపులకి వచ్చాడు ఈ సమయంలో మళ్లీ అరియానా తో గొడవ అయింది. ఆమెను అరవడం వల్ల తనకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని అఖిల్ అడిగాడు. దాంతో నీ పాయింట్ నువ్వు చెప్పు ఆమె తన బాధ చెప్పుకొంది ఏడుస్తుంది ఎవరు ఏడవడం వల్ల ఇక్కడ ఎవరికి ఎఫెక్ట్ కాదు అని అఖిల్ సమాధానం చెప్పి ఊరడించే ప్రయత్నం చేశాడు.
ఈ సమయంలో నాకు ఏడుపు రాదా అని సోహెల్ తనను తాను ప్రశ్నించు కున్నాడు. అప్పుడు అఖిల్ అరవడం వల్ల ఇక్కడ ఎవరికీ ఏమీ కాదు అలాంటి రూల్ లేదు నువ్వు గమ్మున ఉండు నీ వాదన నువ్వు ఆమె వాదన ఆమె వినిపించింది. దీంతో సమస్య తీరిపోయింది ఎక్కువ ఆలోచించకు అని అన్నాడు.
దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉండు అని అఖిల్ సోహెల్ కు వార్నింగ్ ఇచ్చాడు ఇక బాగా టెన్షన్ పడిన సోహెల్ కోపం చల్లారిన తర్వాత తాను ఏం చేశానన్న విషయాన్ని గ్రహించాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!