హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనర్శింహస్వామి ఆలయంపై చెక్కిన కెసిఆర్, టిఆర్ ఎస్ చిహ్నాలను వారిలో గా తొలగించాలని బిజెపి ఫైర్ బ్రాండ్ ఎం ఎల్ ఏ రాజా సింగ్ అల్టిమేటం జారీ చేశారు. శనివారం ఆయన యాదాద్రి దేవస్థానాన్ని సందర్శిచారు. ఆలయంలోని పిల్లర్లు, రాజగోపురం, మండపాలలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో పాటు కెసిఆర్, టిఆర్ ఎస్ గుర్తు అయిన కారు గుర్తులు చెక్కడం వివాదాస్పదం అయింది. టి ఆర్ ఎస్ మినహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు దీన్ని ఖండిస్తున్నారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో చెక్కిన చిహ్నాల తొలగింపుకు వారం రోజులు సమయం ఇస్తున్నామని చెప్పారు. ఆలయాన్ని ఆయన సొంత నిధులతో నిర్మిస్తున్నారా, ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నారా అని రాజా సింగ్ ప్రశ్నించారు. వారం రోజుల్లోగా వాటిని తొలగించకపోతే హిందూత్వ వాదులతో కలిసి ఆందోళన చేపడతామని రాజాసింగ్ హెచ్చరించారు.
Visited #Yadagirigutta temple today, Seen all the pillars where KCR, Car symbols are engraved
We are giving 7 Days time to @TelanganaCMO remove all the statues which doesn't symbolise Hindu mythology
Don't play with sentiments of Hindu's or you need to face the consequences. pic.twitter.com/37bSsQaUbh
— Raja Singh (@TigerRajaSingh) September 7, 2019