Ambani : భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందా? అతని చంపేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఈ అపరకుబేరుడిని అంతమొందించేందుకు ఎవరో చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన తొలి ఐదుగురిలో ఒకరైన ముఖేష్ అంబానీ పైన వామపక్ష భావజాలం ఉన్న వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశంలో పేదలు పెరిగిపోతుంటే ముకేశ్ అంబానీ లాంటివారు రోజు రోజుకూ లక్షల కోట్లకు పడగెత్తుతున్నారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది అన్న విషయం వెలుగు చూడడం గమనార్హం.
తాజాగా ముంబైలోని ముఖేష్ అంబానీ అతి పెద్ద విల్లా వద్ద పేలుడు పదార్థాలతో నింపిన కారును నిలిపివేశారు అన్న విషయం తెలియడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంటికి సమీపంలో ఉన్న వాహనంలో పేలుడు పదార్థాలు ఉన్నాయని భద్రతా సిబ్బందికి ఫోన్ వచ్చింది. అంతే…. ముంబై పోలీసులు హుటాహుటిన ఆ ఇంటిని చుట్టుముట్టారు. దీనిని అంబానీ నే దీన్ని టార్గెట్ చేసి ఏర్పాటు చేశారని గుర్తించారు. వెంటనే బాంబు నిర్వీర్య దళాన్ని రంగంలోకి దింపి తనిఖీ చేయగా ఆ బృందం వాహనంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు ధ్రువీకరించారు/
అయితే ఈ వాహనం అక్కడిది ఎలా వచ్చింది…? ఎవరికి సంబంధించినది అని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిఘా వర్గాలు ఈ ఏడాది మొదట్లోనే అంబానీ కుటుంబానికి ముప్పు ఉందని కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఇంటలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన నెలలోనే ఇలా ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న కారుని వదిలి వెళ్లడం అనేది పోలీసులకు ఒత్తిడి తెచ్చే విషయమే.
ఇక తన సొంత ఖర్చులతో అంబానీ కూడా భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని ఆయన ఇటీవల కేంద్రాన్ని కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. కేంద్ర హోం శాఖ ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఇక ముఖేష్ అంబానీ వ్యవహారం ఇప్పుడు దేశంలోని మిగిలిన బడా పారిశ్రామికవేత్తల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.