ఏపీ, తెలంగాణాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు సహా కేంద్ర జలవనరుల మంత్రి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే తెలంగాణాలో గోదావరిపై తలపెట్టిన ఎత్తిపోతలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. మీరు పోతిరెడ్డిపాడుపై వెనక్కు తగ్గితే మేము ఎత్తిపోతలపై పునరాలోచిస్తామంటూ తెలంగాణ మెలిక పెడుతుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర నీటి యుద్ధం నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ అత్యున్నత స్థాయి సమావేశం కీలకంగా మారింది. వచ్చే నెల 5 న ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా.. ఇరు రాష్ట్రాల సీఎం లు భేటీ కానున్నారు. తద్వారా ఈ సమస్యకి, వివాదానికి ఏమైనా పరిష్కారం దక్కే వీలుంది.
next post