Breaking: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తొంది. కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకూ కొత్తగా 3,712 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క రోజే అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, కేరళ నుండి అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ నియమాలు ఎక్కువ మంది పాటించడం లేదు. మాస్కులు ధరించడం లేదు. ఈ నేపథ్యంలో మరల కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఆందోళన కల్గిస్తొంది. మహారాష్ట్రలో నిన్న మొన్నటి వరకూ స్థిరంగా కేసులు నమోదు అవుతుండగా, బుధవారం ఒక్కరోజే 1081 కేసులు నమోదు అయ్యాయి. గత మూడు నెలల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 19,509 యాక్టివ్ కేసులు ఉండగా, పాజిటివిటీ రేటు 8.4 శాతానికి పెరిగింది. క్రియాశీల రేటు 0.05 శాతంగా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Breaking:హోమ్ ఐసోలేషన్ లో సోనియా గాంధీ
పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనబడటంతో ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తొంది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సోనియా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. గతంలోనే సోనియా గాంధీ కోవిడ్ వ్యాక్సిన్ డోస్ లు రెండు వేయించుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడంతో ఈ నెల 8వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉండగా కరోనా సోకడం గమనార్హం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత కేసి వేణుగోపాల్ కు కూడా కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పలువురు నేతలు సమావేశమైయ్యారు. సోనియా గాందీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో గత వారం రోజులుగా ఆమెతో సమావేశమైన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.